జీవితంలో పెళ్లి అనేది ఒక మధుర జ్ఞాపకం... అయితే పెళ్లి మండపం లో పెళ్లి జరుగుతుంది అంటే బంధు మిత్రులతో పాటు... కావలసిన వాళ్లు అంతా వచ్చి ఎంతో సందడి నెలకొంటుంది. ఇక పెళ్లి జరుగుతుంటే అటు అమ్మాయి తరపు ఇటు అబ్బాయి తరపు తల్లిదండ్రులు చూసి ఎంతో ఆనంద పడిపోతూ ఉంటారు. ఇక్కడ ఇలాంటిదే  జరిగింది. బంధుమిత్రులు అందరూ వచ్చారు.. కావలసిన వాళ్లు అందరూ పెళ్లి మండపానికి చేరుకున్నారు... వేద పండితులు మంత్రాలు చదువుతున్నారు... పెళ్లి మండపం అంతా సందడిగా మారిపోయింది. ఇక అంతా సవ్యంగా జరుగుతుంది అనుకుంటున్న సమయంలో సడన్ గా పెళ్లి ఆగిపోయింది. జీలకర్రబెల్లం పెడుతున్న సమయంలో వధువు వరుడికి ట్విస్ట్ ఇచ్చింది. ఈ ఘటనతో పెళ్లి మండపం లో ఉన్న వాళ్ళు అందరూ షాక్ అయ్యారు. వనపర్తి జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

 

 

 వివరాల్లోకి వెళితే... వనపర్తి జిల్లా కొత్తకోట మండలం చెర్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడుకి .. అదే మండలంలోని పామడారం  గ్రామానికి చెందిన నందిని అనే యువతితో వివాహం నిశ్చయమైంది. శుక్రవారం 10 గంటల 10 నిమిషాలకు పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బంధు మిత్రులందరూ పెళ్లి మండపానికి విచ్చేయగా మొత్తం పెళ్లి సందడి నెలకొంది. కానీ ఇంతలో ఓ ట్విస్ట్. క వధూవరులు ఇద్దరు  జీలకర్ర పెట్టే సమయంలో నందిని అందరికి షాక్ ఇస్తూ తనకు ఇష్టం లేదు అంటూ చెప్పేసింది. దీంతో పెళ్లి మండపం లో ఉన్న వాళ్ళందరూ షాక్ కి గురయ్యారు. అయితే ఆ యువతి తన మేనబావను   పెళ్ళి చేసుకోవాలనే ఉద్దేశంతో పెళ్లి పీటల మీద పెళ్లి ఇష్టం లేదు అని చెప్పినట్లు తెలిసి ఆ యువతి తరపు బంధువులు చితకబాదారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. 

 

 

 ఇకపోతే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. అయితే ఆ యువతి మాత్రం తన మీద భావను  తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని చెప్పడంతో.. తీవ్ర అవమానంగా భావించిన వరుడు తరపు బంధువులందరూ పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత యువతి తరపు బంధువులు తల్లిదండ్రులతో మాట్లాడిన పోలీసులు యువతి ఇష్టం లేకుండా పెళ్లి చేయవద్దు అంటూ సూచించారు. దీంతో పెళ్లి పీటల వరకు వచ్చిన పెళ్లి కాస్త పెటాకులుగా  మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: