మరో
బాబా ఇటీవలె వెలుగు లో కి వచ్చాడు. గుట్టు బయట పడకుండా ఇన్నాళ్ళు ఎందరినో తన ఆదీనం లో కి తీసుకున్నాడు ఈ బాబా.తాను కృష్ణుడు అంటూ అమ్మాయల్ని గోపికలు గా భావిస్తున్నాడు. అయితే
డ్రగ్స్ ఇచ్చి లైంగికంగా లొంగ తీసుకుంటున్నాడట. ఇలా ఒకరి ఇద్దర్ని కాదు ఏకంగా ఎందరో మందిని ఇతను లొంగ తీసుకుంటున్నాడుట.
కనిపించిన అమ్మాయిల కి అదీ ఇదీ చెప్పి
మాయ మాటలతో లొంగ తీసుకుంటున్నాడు. అంతే కాకుండా
డ్రగ్స్ ఇచ్చి వశం చేసుకుంటున్నాడు ఈ బాబా. అమ్మాయిలని చెరపట్టి ఆశ్రమం లో నిర్భందించడమే ఇతని పని. కనిపించిన ఆడవాళ్ళకి కట్టు కధలు చెప్పి ఇక్కడ బంధిస్తున్నాడు. నిజమాబాద్ కి చెందిన
అమ్మాయి ఈ
దొంగ బాబా వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఉచ్చు లో పడిన వార్త ఇటీవలె వెలుగు లో కి వచ్చింది.
ఆ
అమ్మాయి వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి. ఈమె నిజామాబాద్ జిల్లాకు చెందిన దుంపల రాంరెడ్డి, మీనవతి దంపతుల కుమార్తె ఆమె. అయితే ఈమె అనంతపురం జేఎన్టీటీయులో కెమికల్ ఇంజినీరింగ్ చదువుకుంది. ఆ తర్వాత ఈమె యూ.ఎస్ వెళ్ళి ఎం.ఎస్ చేసింది.
హఠాత్తుగా కనిపించని
అమ్మాయి కోసం ఆరా తీసారు
అమ్మాయి తల్లిదండ్రులు. అయితే ఈమె
ఢిల్లీ లో వీరేంద్ర దేవ్
బాబా ఆశ్రమం లో ఉన్నట్లు సమాచారం తెలిసింది. వెతుక్కుంటూ వెళ్ళారు
అమ్మాయి తల్లిదండ్రులు కానీ తండ్రికి మాత్రమే లోపల కి అనుమతి ఇచ్చారు. అయితే ఆమె రానని చెప్పేసింది.
ఆమె దేవతని అంటూ...మీరు మరణిస్తారు, నేను దేవతని అవుతాను అంటూ కుమార్తె
సంతోషి చెబుతోంది. అయితే తనిఖీ లో మాత్రం
డ్రగ్స్ వంటివి ఉన్నట్లు సమాచారం