టాలీవుడ్ లేడీ అమితాబ్... విలక్షణ నటి విజయశాంతి... మళ్లీ సినిమాలకు దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో అగ్ర తారగా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి సినిమాలను పూర్తిగా దూరం పెట్టేసింది. అయితే విజయశాంతి సినిమాలకు ఎంత దూరమైనప్పటికీ విజయశాంతి నటించిన సినిమాలు ఆమె  చేసిన పాత్రలు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అయితే విజయశాంతి ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందా అని అభిమానులు కూడా వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. అయితే ఎంతో మంది దర్శక నిర్మాతలు విజయశాంతిని  మళ్లీ సినిమాల్లోకి తీసుకురావాలని ప్రయత్నించినప్పటికీ... విజయశాంతి మాత్రం సినిమాల్లో నటించేందుకు ససేమిరా అన్నది. 

 

 

 

 ఇక చివరికి సక్సెస్ఫుల్ యువ దర్శకుడు అనిల్ రావిపూడి విజయశాంతి ని ఒప్పించడంతో.. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది విజయశాంతి. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా లో ప్రొఫెసర్ భారతిగా విజయశాంతి నటన ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది అన్న విషయం తెలిసిందే. ప్రొఫెసర్ భారతీ పాత్రలో విజయశాంతి నటనకుగాను ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నారు విజయశాంతి. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి నటించడం ఆ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సినీ నటి విజయశాంతి తో దిగిన ఫోటోను సరిలేరు నీకెవ్వరు దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. 

 

 

 

 ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అనిల్ రావిపూడి... మీతో కలిసి పనిచేయడం చిరకాలం గుర్తుండిపోయే అనుభవం విజయశాంతి మేడం... చాలా కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై మీరు పునరాగమనం ఇచ్చిన సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం నాకు రావడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మీరు నటించిన తీరు నటన నైపుణ్యాలు శాశ్వతం అని నిరూపించింది అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అనిల్ రావిపూడి ఈ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: