వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలను తన ట్విట్లతో చమటలు పట్టిస్తుంటారు. ఇక ఈ నేపథ్యంలోనే మరో సంచలన ట్విట్ పెట్టి షాక్ కి గురి చేశాడు విజయసాయి రెడ్డి. నిజానికి ఉదయం నుండి ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అతని సుపుత్రుడు నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు విజయసాయి రెడ్డి.  

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. ''ఉత్తరాంధ్ర ప్రజలంటే అంత చులకన భావమెందుకు చంద్రబాబూ? ఒక వైపు అమరావతి నుంచి రాజధాని తరలించ వద్దని ఉత్తుత్తి ఉద్యమాలు నడిపిస్తావు. మళ్లీ ఉత్తరాంధ్ర వెళ్లి అక్కడి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తావు. వారి ఆత్మగౌరవంతో ఆటలాడుకుంటే ఇలాంటి శాస్తే జరుగుతుంది.'' అంటూ ఘాటు ట్విట్ పెట్టారు. దీంతో ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.        

 

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.. కొందరు ట్విట్ చేస్తూ ''అప్పుడే ఏమైంది. ఇంకాఎన్ని రౌండ్స్ వేస్తాడో విశాఖకు. ఆయనకు సానుభూతి కావాలి. నిమిష నిమిషానికి వయస్సు వారి 40 సంవత్సరాల గురించి ప్రస్తావిస్తారు. ప్రజలు చిత్తుగా ఓడించి ఇంట్లో కుర్చుపెడేతే రోడ్డుమీద పడి చెప్పులు కోడిగుడ్లు వేస్తుంటే కూడా ఉత్తరాంధ్రకి వ్యతిరేక దోరణి మనుకోవటం లేదు.'' అంటూ ఘాటైన ట్విట్లు చేశారు నెటిజన్లు.     

 

మరింత సమాచారం తెలుసుకోండి: