ఈ మధ్యకాలంలో మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా  మహిళలపై అత్యాచారాలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కామపు  కోరల్లో చిక్కుకొని మహిళలు బలైపోతున్నారు. ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారిని ఎన్కౌంటర్ చేసి చంపినప్పటికీ కామాంధుల్లో  మాత్రం ఎక్కడ భయం కనిపించడం లేదు. రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇక మొన్నటి వరకు రోడ్డు మీద నడిస్తే ఆకతాయిల నుంచి.. చదువుకోవటానికి వెళ్తే  గురువుల నుంచి మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొనే వారు.. కానీ ఇప్పుడు మాత్రం.. సొంత ఇంట్లో కూడా మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. 

 

 

 సొంత ఇంటి నుంచి రక్తం పంచుకుని పుట్టిన వారి నుంచి లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి ఎంతో మంది  మహిళలు ప్రశ్నార్ధక జీవితాన్ని గడుపుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి కనీస వావివరుసలు మరచి అతి దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్యకాలంలో తోబుట్టువులను  నుండి... జన్మనిచ్చిన వాళ్ల నుండి  లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు...దీంతో  మహిళలుగా పుట్టడమే తప్ప అని మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు ఆడపిల్లలు. ఇలా సొంతింటి వారి నుంచి లైంగిక వేధింపులు ఎదురవుతున్న ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి

 

 

 ఇక తాజాగా ఇలాంటిదే మరొక ఘటన జరిగింది. జిల్లాలోని దుండిగల్  ల్లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మైనర్ కూతుల్లపై కన్నతండ్రి అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక ఈ విషయం తెలిసిన భార్య... ఇంత నీచానికి ఒడిగట్టావ్  అంటూ భర్తను నిలదీయడంతో... ఏకంగా భార్యని హత్య చేసేందుకు ప్రయత్నించాడు దుండగుడు. దీంతో భయపడిపోయిన భార్య పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి తల్లి  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: