సాధారణంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనగానే అందరికి ఒకరకమైన ఆసక్తి ఉంటుంది. ముందు నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయినా సరే ఆంధ్రా ప్రాంతానికి రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద సోషల్ మీడియా ప్రధాన మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తూ వస్తుంది. ఇక ఈ వారం రాజకీయాల విషయానికి వస్తే... ఏపీ రాజకీయాల్లో ఈ వారం ముఖ్యమంత్రి జగన్ హీరో అనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఆయన చేస్తున్న పాలన, చంద్రబాబు ఇంకా ఆయన ట్రాప్ లోనే ఉండటం ఆశ్చర్యం కలిగించే అంశం. 

 

జగన్ ఈ వారం విద్యా వసతి దీవెన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా పేద విద్యార్ధులకు ఆర్ధిక సహాయం అందించింది రాష్ట్ర ప్రభుత్వం. డిగ్రీ నుంచి ఆ పైన చదివే విద్యార్ధులకు ఈ ఆర్ధిక సహాయం అందిస్తుంది. ఇక పరిశ్రమల మీద కూడా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనితో సోషల్ మీడియాలో ఆయన హీరో అయ్యారు అనే చెప్పాలి. ఇక సంక్షేమ కార్యక్రమాల మీద కూడా జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సాగునీటి ప్రాజెక్టుల ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. సాగునీటి ప్రాజెక్టుల్లో కీలకమైన పోలవరం పర్యటనకు వెళ్ళారు ముఖ్యమంత్రి. 

 

ఈ సందర్భంగా 16 నెలల్లో పూర్తి చెయ్యాలి అనే ఆదేశాలు ఇచ్చారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబాని తో ఆయన సమావేశం కావడం కూడా హైలెట్ గా నిలిచింది. అంబాని నే స్వయంగా వచ్చి జగన్ ని కలవడం పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకుని జగన్ తో చర్చించడం వంటివి హైలెట్ గా నిలిచాయి. దీనితో ఆయన హీరో అంటున్నారు పలువురు. అదే విధంగా అధికారుల విషయంలో జగన్ అనుసరిస్తున్న వైఖరి కూడా ఆయన్ను హీరో చేసింది అంటున్నారు పలువురు.

మరింత సమాచారం తెలుసుకోండి: