ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపుత్రుడు నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండే విజయసాయి రెడ్డి ఎప్పటికప్పుడు ప్రతిపక్ష నేత మాటలను తిప్పికొడుతుంటారు. 

 

ఈ నేపథ్యంలోనే ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడు సుపుత్రుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. తండ్రి చంద్రబాబు అధికారం పోయింది అని చిట్టినాయుడు సైకోపాత్ లా మారిపోయాడు అంటూ సెటైర్లు వేశారు.. చీకటిలో కూర్చొని అందరిపైకి రాళ్లు, పిడకలు విసురుతున్నారు అని.. మీడియా ముందుకు వచ్చి మాట్లాడు చిట్టి.. నీ కామెడీ కోసం అంత ఎదురు చూస్తున్నాం అని అన్నారు..  

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. తండ్రి అధికారం పోయింది. ఎమ్మెల్సీ పదవి రేపోమాపో ఊడుతుంది. ఇంకో పక్క అక్రమ సంపాదనల డొంక కదులుతుంటే చిట్టి నాయుడు సైకోపాత్(Psychopath)లా మారిపోయాడు. చీకట్లో కూర్చుని అందరిపైకి రాళ్లు, పిడకలు విసురుతున్నాడు. బయటకొచ్చి మాట్లాడు చిట్టీ, నీ కామెడీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.'' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు విజయసాయిరెడ్డి. 

 

దీంతో ఈ ట్విట్ చుసిన నెటిజన్లు అంత కూడా.. సాయి రెడ్డి గారు ఎందుకు అండి మాపై అంత కక్ష కట్టారు.. అయన మాట్లాడే తెలుగు వింటే చెవుల నుండి రక్తం వస్తుంది అండి అంటూ కామెంట్లు చేశారు.. మరికొందరు స్పందిస్తూ.. ఈ చిట్టినాయుడు కూడా తండ్రిలా తయారవుతున్నారు అంటూ ట్విట్ చేస్తున్నారు.. దీంతో ఈ ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: