ప్రతిరోజూ దేశ వ్యాప్తంగా మహిళలపై వృద్దులపై చివరికి చిన్నారులపై అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతుంది. ఓ వైపు ప్రభుత్వాలు నేరస్థులకు కఠిన చట్టాలు విధిస్తున్నామని చెబుతున్నా.. కామాంధులు ఎక్కడో అక్కడ రెచ్చిపోతూనే ఉన్నారు. అడవిలో మృగాల కన్నా దారుణంగా పైశాచికత్వంతో ఆడవారిని చూస్తే రెచ్చిపోతున్నారు. అయితే దీనికి కారణం విచ్చలవిడిగా సెల్ ఫోన్ లో ఫోర్నోగ్రఫి ప్రభావం అని.. స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి సెల్ లో ఇంటర్ నెట్ సౌలభ్యం ఉండటం.. వాటిలో ఫోర్న్ సైట్లు చూసి చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా కొంత మంది మృగాళ్లు రెచ్చిపోతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది ఎంత దారుణం అంటే తాము చేస్తున్న అకృత్యాలు వీడియోలు, ఫోటోలు తీసి ఫోర్నోగ్రఫి సైట్స్ లో అప్ లోడ్ చేస్తున్నారు కొంత మంది కంత్రీగాళ్లు.
ఇటీవల తెలంగాణలో దిశ కేసు విషయంలో ఇలాంటి దారణమే చోటు చేసుకుంది. కృర మృగాళ్లలా రెచ్చిపోయిన నలుగురు టీనేజర్స్ వెటర్నరీ డార్టర్ అయిన దిశపై దారుణమైన అత్యాచారం చేసి ఆపై ఆమెను దహనం చేశారు. అయితే వీరు తాము చేసిన పాపానికి శిక్ష విధింపబడ్డారు. సీన్ ఆఫ్ యాక్షన్ సందర్భంగా పోలీసులపై నలుగురు నింధితులు తిరగబడటంతో తమ ఆత్మరక్షణ కోసం పోలీసులు వారిని ఎన్ కౌంటర్ చేశారు. అయితే దిశ అత్యాచార, హత్య కేసు విషయంలో ప్రజలు కూడా ఇదే కోరుకున్నారు. అయితే ప్రతి ఒక్కరికీ ఇలాంది శిక్షలు విధించాలని మహిళా సంఘాలు కోరకుంటున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలో వృద్ధురాలిపై జరిగిన దారుణం కామాంధుల కర్కశత్వాన్ని మరోసారి బయటపెట్టింది.
నల్గొండ జిల్లా అనుముల మండలం మారేపల్లి గ్రామంలో 90 ఏళ్ల వృద్ధురాలిని శంకర్ అనే యువకుడు వ్యక్తి అర్ధరాత్రి సమయంలో అత్యాచారం, హత్య చేసి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన చూసి గ్రామస్తులు ఒక్కసారే ఉలిక్కి పడ్డారు. నింధితునిపై పోలీసు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ నింధితున్ని పట్టుకొని ఉరి వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.