టాలీవుడ్‌ టాప్‌ కమెడియన్‌, వైసీపీ నేత, ఎస్‌వీబీసీ మాజీ చైర్మన్‌ పృధ్వీ కష్టాలు అంతా ఇంతా కాదు.. ఈ కమెడియన్ కి బ్యాడ్ టైమ్ నడుస్తుంది కాబోలు.. ఏది పట్టుకున్న బంగారం.. అనే సామెతను తీసేసి ఏది పట్టుకున్న బండరాయి.. అనే సామెత వస్తుందేమో.. ఈయన పరిస్తితి వింటే.. ఏమైంది అంటారా..?? టాలీవుడ్‌ కి సంబంధించి ఎందరో ప్రముఖులు, బడా సెలబ్రిటీలు వైసీపీకి సపోర్ట్‌ చేసినా, ఆ పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచినా ఎస్‌వీబీసీ చైర్మన్‌ వంటి కీలక పదవిని పృధ్వీకి కట్టబెట్టాడు ఏపీ సీఎం జగన్‌.

 

అయితే... ఏ ముహూర్తాన ఆయనకు సంబంధించిన ఆడియో టేప్‌ లీక్‌ అయిందేమో కానీ, అప్పటినుండి పృధ్వీకి బ్యాడ్‌ టైమ్‌ నడుస్తోంది.  దానిని నిజం చేస్తూ పృధ్వీ ఓ మహిళతో రాసలీలలు చేసిన ఆడియో టేప్‌లు లీక్‌ అయ్యాయి.. దీంతో, ఆయనను పదవి నుండి వెంటనే జగన్ తప్పించాడు. ఆ ఆడియో టేప్‌లలోని వాయిస్‌ తనది కాదని పృధ్వీ వాదిస్తున్నా… ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్‌ మొత్తం జరిగిపోయింది. ఆయన పదవి పోయింది. మచ్చ కూడా పడింది. 

 

 అయితే, తనపై పడిన మరకను చెరిపేసుకోవడానికి పృధ్వీ శతవిధాలా ప్రయత్నిస్తూ తాజాగా పలు చానెల్స్‌ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తనకి జగన్‌ మరోసారి పదవి కట్టబెడతాడని, తాను నిర్దోషిగా బయటకు వస్తానని ధీమాగా చెబుతున్నాడు పృధ్వీ. తన చుట్టూ కుట్ర జరిగిందని అది త్వరలోనే బయటకు వస్తుందని అంటున్నాడు. ఆడియో లీక్‌ ఎపిసోడ్‌ తర్వాత పృధ్వీ ఇంతవరకు జగన్‌ని కలవలేదు. సీఎం కావడంతో పృధ్వీకి అపాయింట్‌ మెంట్‌ కూడా ఇవ్వడం లేదని పార్టీ వర్గాలు, రాజకీయ విశ్లేషకుల నుండి మాటలు వినిపిస్తున్నాయి.

 

 

 పృధ్వీకి కనీసం.. టీటీడీ చైర్మన్‌ ఎస్‌వీ సుబ్బారెడ్డి అపాయింట్‌మెంట్‌ కూడా దొరకడం లేదని సమాచారం. ఎస్‌వీ సుబ్బారెడ్డి తనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని ఆయన తన బాధ, ఆవేదన, ఆందోళన అంతటినీ సోషల్‌ మీడియా, యూ ట్యూబ్‌ చానెల్స్‌ ఇంటర్‌వ్యూలతో పెద్దాయనకు చేరేలా ప్లాన్‌ చేసుకున్నాడట. మరి, పృధ్వీ ఆవేదన, మొర ఎస్‌వీ సుబ్బారెడ్డికి చేరి అపాయింట్‌మెంట్‌ దొరుకుతుందో లేదో అనేది చూడాల్సిందే మరి. పృధ్వీ పడుతున్న కష్టాల నుంచి త్వరగా గట్టెక్కాలని ఆశిద్దాం...

మరింత సమాచారం తెలుసుకోండి: