ఇటీవ‌ల స‌మాజం రోజు రోజుకీ దారుణంగా తయార‌వుతున్నాయి. పసి పిల్లల దగ్గర నుంచి చావు దగ్గరైన ముసలమ్మను కూడా కొందరు కామాంధులు వదలడం లేదు. దీంతో మహిళలు రోడ్డుపై తిరగాలంటే భయపడిపోతున్నారు.  దేశంలో నిత్యం ఎక్కడో ఒకచోట మహిళపై అత్యచారాలు జరుగుతూనే ఉన్నాయి. పసి పిల్లల దగ్గర నుంచి చావు దగ్గరైన ముసలమ్మను కూడా కొందరు కామాంధులు వదలడం లేదు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న, కోర్టులు నిందితులకు జైలు శిక్షలు విధిస్తున్న.. ఆడ‌వారిపై అత్యాచారాలు, అత్యాచారయత్నాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. 

 

తల్లీ, చెల్లీ అనే తేడా లేకుండా తమ కామ వాంఛ తీర్చుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు.  కన్నుమిన్ను కానక కామం ఒక్కటే సంతృప్తిని ఇస్తున్నట్లుగా బ్రతికేస్తున్నారు లోకంలోని మనుషులు. అత్యాచారాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నా.. మరోవైపు మాత్రం అవేమి పట్టించుకోని కొంతమంది మృగాళ్లు తమపని తాము చేసుకుపోతున్నారు. మ‌రియు ముక్కుపచ్చలారని చిన్నారులను కూడా కామాంధులు రేప్ చేస్తున్నారు. ఇక తాజాగా ఓ మాన‌వ మృగాని కామానికి ఆరేళ్ల చిన్నారి బ‌లైంది. ఆడుకుంటున్న ఓ చిన్నారిని ఓ యువకుడు ఎత్తికెళ్లి అతి కిరాతంగా అత్యాచారం చేశారు. ఈ దారుణం ఘ‌ట‌న  భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. 

 

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. భూపాలపల్లి జిల్లా మొగుల్లపల్లి గ్రామంలో ఆరేళ్ల చిన్నారి ఆడుకుంటుండగా ఓ యువకుడు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. స‌ద‌రు చిన్నారి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటుండగా.. చిన్నారిని నానమ్మ వద్ద ఉంచారు. ఈ క్రమంలోనే చిన్నారిపై ఈ ఘాతుకం జరిగింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి యువకుణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంట‌నే స‌ద‌రు చిన్నారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా,  చిన్నారిపై అత్యచారం సంఘటన భూపాలపల్లి జిల్లా తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. స‌ద‌రు నిందితుడికి వెంట‌నే త‌గిన శిక్ష వేయాలంటూ డిమాండ్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: