ఈ మద్య వివాహ బంధాలను బ్రష్టుపట్టిస్తున్నారు కొంతమంది స్వార్థపరులు.  అనుమానం.. అక్రమ సంబంధాలు ఈ కారణంతో కట్టుకున్న భర్తలను భార్యలు.. భార్యలను భర్తలు దారుణంగా హతమారుస్తున్నారు.  తాజాగా తన అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని కట్టుకున్న భార్యనే దారుణంగా చంపేసి పోలీసులకు కట్టు కథ చెప్పి అడ్డంగా బుక్ అయ్యాడు.  తన భార్యను దోపిడి దొంగలు కాల్చి చంపారని.. రూ.1.5లక్షలు నగదు దోచుకున్నారని పోలీసుల వద్ద మొరపెట్టుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు ఆమె భర్తపై అనుమానం వచ్చింది.  అయితే చిన్నారులను దగ్గరకు తీసుకొని అసలు విషయం ఏంటో తెలుసుకొని ఆ దుర్మార్గున్ని అరెస్ట్ చేశారు.   అయితే తన  తల్లిని చంపింది తన తండ్రే అని కొడుకు చెప్పడంతో షాక్ తిన్నాడు. 

 

ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో రాఖీ, నేత్రాపాల్ సింగ్ లు భార్య భర్తలు. వారికి ఇద్దరు పిల్లలు. భర్త నేత్రాపాల్ పెళ్లై పిల్లలున్నా మరో మహిళతో అక్రమ సంబంధం నెరిపేవాడు.  అక్రమ సంబంధంపై భార్య రాఖీ భర్త నేత్రాపాల్ ను నిలదీసింది.  తన అక్రమ సంబంధాన్ని నిలదీయడంతో పగ పెంచుకున్న నేత్రాపాల్ భార్య అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు.  అంతే తన భయంకరమైన ప్లాన్ అమలు పరిచాడు.  తన వద్ద ఉన్న తుపాకీతో భార్యను కాల్చి చంపాడు. అయితే తన నేరం బయట పడకుండా ఉండేందుకు ఓ భయంకరమైన ప్లాన్ వేశాడు.  తన ఇంటికి కొంత మంది దోపిడి దొంగలు వచ్చారని.. తనను కొట్టి అడ్డు వచ్చిన తన భార్యను అన్యాయంగా కాల్చి చంపారని కన్నీరు పెట్టుకున్నాడు.   

 

నేత్రాపాల్ ఫిర్యాదుతో పోలీసులు బాధితురాలి మృతిపై విచారణ ప్రారంభించారు. పోలీసులు విచారణలో నేత్రాపాల్ బాగానే మ్యానేజ్ చేశాడు. మొదట నేత్రపాల్ చెప్పింది నమ్మినప్పటికీ తర్వాత అనుమానం వచ్చింది. పోలీసులు నేత్రాపాల్ పిల్లల్ని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అంకుల్ మా నాన్న మా అమ్మని చంపాడు అంటూ అమాయకంగా చెప్పారు.  ఆ తర్వాత తమదైన శైలిలో ప్రశ్నించగా ఉన్న నిజం చెప్పాడు.  దీంతో నిందితుణ్ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: