పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది అనే సామెత కు సరిగ్గా సరిపోయేలా ఓ ఘటన వెలుగుగు చూసింది.. హత్య చేసిన హంతకుడు నన్ను ఎవరు పట్టుకోలేరు అంటూ అనుకోని ఆధార్ కార్డు ఆధారంగా చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతునులిమి దారుణంగా హత్య చేసి పడేసిన ఘటనలో వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విచారణలో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. 

 

 

తన సొంత బాబాయ్‌ని అన్న కొడుకే దారుణంగా చంపేసినట్లు తేలింది. కులాంతర వివాహం చేసుకునేందుకు బాబాయ్ రెడీ అయ్యాడని.. అందుకే చంపేశాడని చెప్పడంతో పోలీసులే షాక్‌కు గురయ్యారు.ఆగ్రాకి చెందిన సుధాకర్ శర్మ అనే వ్యక్తి గత నెల 28 నుంచి కనిపించకుండా పోయాడు. కొద్దిరోజులకి ఆయన మృతదేహం లభ్యమైంది. మృతుడి వదిన విమలేష్ శర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సుధాకర్ శర్మ అన్న కొడుకు నిఖిల్ శర్మ బాబాయ్‌ని హత్య చేసినట్లు గుర్తించారు.

 

 


సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి ..సుధాకర్ శర్మ బిహార్‌కి చెందిన ఓ మహిళను కులాంతర వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అది నచ్చని నిఖిల్ శర్మ.. బాబాయ్‌కి పదేపదే చెప్పాడు. తక్కువ కులానికి చెందిన మహిళ అంటూ.. ఆమెను పెళ్లి చేసుకుని కుటుంబం పరువు తీయొద్దంటూ బాబాయ్‌తో గొడవపడ్డాడు. అయినా బాబాయ్ ససేమిరా అనడంతో అబ్బాయ్ దారుణానికి ఒడిగట్టాడు. 

 

 

 

మరో విషయమేంటంటే.. తన మరిదిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపారని కేసు పెట్టిన అతని కొడుకే నిఖిల్ శర్మ.. ఆస్తి కోసమే అతన్ని చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.. అయితే ఇక్కడ కులాంతర వివాహాల కారణంగా హత్య చేసినట్లు విచారణలో తేలింది.. ఈ విషయం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: