అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మామూలుగా ఉండదు అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా భారత పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సహా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారు కూతురు అయినా ఇవంక ట్రంప్ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సహా కుటుంబ సభ్యులు అందరు భారత్ లోని పలు ప్రదేశాలను సందర్శించారు. ఇక ఇవాంకా ట్రంప్ రాక కోసం భారత్ లో ఎంతోమంది అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసారు. ఇవాంక తో ఒక సెల్ఫీ తీసుకుంటే చాలు అని ఆశ పడిన వారు కోట్లలోనే ఉన్నారు.అయితే కొంతమందికి ఇవాంకా ట్రంప్ తో  ఫోటో తీసుకునే అవకాశం దొరికినప్పటికీ...  కొంతమందికి మాత్రం నిరాశే ఎదురైంది అని చెప్పాలి. 

 

 

 అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ తమకు సెల్ఫీ ఇవ్వలేదు అని ఎవరూ  కాస్త అయినా నిరాశ చెందలేదు. ఇక తమ వద్ద ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని... ఇవాంకా ట్రంప్ తో సెల్ఫీ తీసుకున్నట్లుగా కొన్ని ఫొటోలను ఎడిట్ చేసి ప్రస్తుతం ఆ ఫోటోలతో మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీనిలో భాగంగానే ఓ కుర్రాడు ఎడిట్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. 

 

 

 ఆ కుర్రాడు నడుపుతున్న సైకిల్ పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవంకా ట్రంప్  కూర్చున్నట్లుగా ఆ యువకుడు ఫోటో ఎడిట్ చేసాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా...  నిజంగానే ఇవాంకా ట్రంప్ సైకిల్ పైన ఎక్కిందా అని ఆ ఫోటో చూసిన వారికి ఆశ్చర్యం కలగక మానదు. దీంతో ఇవాంకా ట్రంప్ ను తన  సైకిల్ పై  ఎక్కించుకుని తిరగాలి అనుకుని తన కోరికను ఈ విధంగా తీర్చుకున్నాడు ఆ కుర్రాడు. ఏదేమైనా ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: