ఈ మధ్య కాలంలో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. మహిళలపై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కామాంధులు తీరులో మాత్రం మార్పు రావడంలేదు. అత్యాచార ఘటనలో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపిన ఎవరిలో కాస్తయినా భయం కనిపించడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి విచ్చలవిడిగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఆడపిల్లల పై అత్యాచార నిందితులకు ఉరి శిక్షలు పడుతున్న ఎక్కడ మార్పు మాత్రం కనిపించడం లేదు. రోజురోజుకు మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన జరిగింది,
12 ఏళ్ల బాలికను నమ్మించి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. డిన్నర్ చేద్దాం 12 ఏళ్ల బాలికను నమ్మించి అడవుల్లోకి తీసుకెళ్లి నా దుండగులు ఓకే సరిగా ఏడుగురు బాలికపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. బాలికపై వాంఛను తీర్చుకుని సదరు బాలికను దారుణంగా చంపేశారు. ఇక బాలిక ఆత్మహత్య చేసుకున్న చనిపోయింది అని నమ్మించేందుకు ఆ శవాన్ని చెట్టుకు వేలాడదీశారు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది.
బిశ్వనాధ్ జిల్లాకు చెందిన 12 ఏళ్ల బాలికపై కన్నేసిన కామాంధులు ఎలాగైనా సదరు బాలికపై కామ వాంఛ తీర్చుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే బాలికకు మాయమాటలు చెప్పి సమీపంలోని అటవీ ప్రాంతంలో కి తీసుకెళ్లారు. ఇంతలో ఏడుగురు టీనేజర్లు ఆ బాలికపై పశువాంచ తీర్చుకున్నారు. రేప్ చేసిన విషయం ఎవరికైనా చెబితే ప్రాణాలు తీసేస్తామంటూ బెదిరించారు. అయినప్పటికీ ఆ బాలిక ఎవరికైనా ఈ విషయం చెబుతుందేమో అని భయం తో దారుణంగా అక్కడికక్కడే చంపేశాడు. ఇక ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఆ బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లుగా... చెట్టుకు ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించారు. బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా... గ్రామానికి చెందిన టీనేజర్ల పై అనుమానం వచ్చి... వారి గురించి గాలించగా వాళ్ళు అటవీ ప్రాంతంలో కనిపించారు... కుటుంబ సభ్యులను చూసి యువకులు పారిపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల గాలించగా బాలిక చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే. రేప్ చేసిన వాళ్ళు అంతా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయడం గమనార్హం.