ఈ మధ్యకాలంలో మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరులో మార్పు రావడం లేదు. మహిళలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఎన్కౌంటర్ చేసి దారుణంగా చంపినప్పటికీ ఎవరి లో కాస్త అయినా భయం కనిపించడంలేదు. కామంతో కళ్లు మూసుకుపోయి అతి దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. పాలు తాగే పసిపిల్లల నుంచి పండు ముసలి దాకా ఎవరినీ వదిలిపెట్టడం లేదు కామాంధులు. ఇలా అనునిత్యం అత్యాచారాలకు గురి అవుతూ ప్రశ్నార్ధక జీవితాన్ని గడుపుతున్నారు మహిళలు. ఇంటి నుంచి కాలు బయట పెట్టిన ఆడపిల్ల మళ్లీ ఇంటికి క్షేమంగా తిరిగి వస్తుందా అనే భయంతోనే తల్లిదండ్రులు కూడా బతుకును వెళ్లదీస్తున్నారు. 

 

 

 ఇక్కడ కామాంధుల బారిన పడి ఇద్దరు బలయ్యారు. ఒకరు ఆరేళ్ళ చిన్నారి కాగా మరొకరు 90 ఏళ్ల బామ్మ. కామపు కోరల్లో చిక్కుకొని బలైపోయారు. వివరాల్లోకి వెళితే... తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం లో అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు తెచ్చుకున్నాడు. ఆ చిన్నారి తల్లిదండ్రులు కొన్నేళ్ళ క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వెళ్లారు. తన ఒక్కగానొక్క కూతురుని నాన్నమ్మ దగ్గర ఉంచి  బాగోగులు చూసుకోమని చెప్పారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆ బాలిక ఇంటివద్ద ఆడుకుంటుండగా... మద్యం తాగి అటువైపుగా వచ్చిన రమేష్ అనే కామాంధుడు... ఆ చిన్నారిని  ఇంట్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు.

 

 

 అనంతరం ఆ చిన్నారి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తుండగా తీవ్ర రక్తస్రావం అవుతూ ఉండటాన్ని గమనించిన స్థానికులు... విషయం తెలుసుకుని నిందితుడిని చితకబాదారు. ఇక స్థానికుల ఫిర్యాదు మేరకు పోక్సో  చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని కటకటాల వెనక్కి తోశారు. ఇదిలా ఉంటే నల్గొండ జిల్లా అనుముల మండలం ఆరేపల్లి లో శనివారం... వృద్ధురాలు అత్యాచారం హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలిపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సమయంలో తీవ్ర రక్తస్రావం అవ్వగా... అయితే ఆమెను హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. మృతురాలి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: