ఇటీవలే పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తి అయిన తర్వాత... పెళ్లి పీటలపై పెళ్లి జరుగుతున్న సమయంలో వధువు తల్లి వరుడి తండ్రి ప్రేమ పేరుతో పరారైన ఘటన సంచలనం గా మారిన విషయం తెలిసిందే. దీంతో ఎంతో ఆనందంగా జరగాల్సిన యువ వధూవరుల పెళ్లి కాస్త.. వృద్ధ ప్రేమతో ఆగిపోయింది. అయితే ఇది స్థానికంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇక తాజాగా తమ తప్పును తెలుసుకొని తిరిగి ఇంటికి వచ్చారు. మళ్లీ ఏమైందో తెలియదు కానీ మరోసారి ఇద్దరూ కలిసి చెక్కేసారు. వివరాల్లోకి వెళితే... నగరానికి చెందిన.. హిమ్మత్ పాండే (46) కుమారుడిని విజయపురి పట్టణానికి చెందిన శోభన (43) కూతురు  తో పెళ్లి కుదిరింది. పెళ్లికి ఇరు కుటుంబాలు సిద్ధమయ్యాయి. 

 

 

 

 పెళ్లి పనులన్నీ పూర్తయ్యాయి... ఇక పెళ్లికి ఇరు కుటుంబాలు అన్నీ సిద్ధం చేసుకుని ఇంకొన్ని రోజుల్లో పెళ్లి జరుగుతుంది అనుకున్న సమయంలో.. వధువు తల్లి వధువు తండ్రి ప్రేమ పేరుతో పరారయ్యారు. దీంతో వీరి తీరు చూసి అందరూ అవ్వ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.పిల్లలకు ఆనందంగా పెళ్లి చేయాల్సిన సమయంలో... పెద్దలు ఇలా చేయడం ఏమిటని అందరూ పశ్చాత్తాప పడ్డారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. అయితే ప్రియుడితో వెళ్లి పోయి మళ్ళీ తిరిగి వచ్చిన శోభనను  భర్త అంగీకరించకపోవడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే తన ప్రియురాలిని భర్త అంగీకరించడం లేదు అన్న విషయం తెలిసిన ప్రియుడు జీర్ణించుకోలేకపోయాడు.

 

 

 ఇక ఈ అవమానం భరించడం ఇష్టంలేక తాజాగా మరోసారి...ఈ  ఇద్దరు పరారయ్యారు. సూరత్ లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ కాపురం పెట్టేసారు. అయితే వీరిద్దరికీ చదువుకునే వయసు నుంచే పరిచయం ఉన్నట్లు బంధువులు చెబుతున్నారు. అప్పుడే వీరిద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేక పోయారు. ఇక తాజాగా పిల్లల పెళ్లితో  కలిసిన ఇద్దరి మధ్య పాత జ్ఞాపకాలు చిగురించినట్టున్నాయి.... ఏకంగా పిల్లలు ఉన్నారని భర్త ఉన్నాడని కూడా మర్చిపోయి.. సభ్యసమాజం తలదించుకునేలా.. అంత వయసులో కూడా ప్రేమ పేరుతో పరారయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: