ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో హత్యలు ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అయితే అక్రమ సంబంధాల కారణంగా ఎన్ని దారుణ ఘటన లు జరిగినప్పటికీ అక్రమ సంబంధాల వ్యవహారాలు మాత్రం తగ్గడం లేదు. భర్త చని పోవడం వల్ల కొంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఇంకొంతమంది.. భర్త బ్రతికుండగానే మోసం చేస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. ఇక అడ్డొచ్చిన భర్తను చంపడానికి కూడా వెనుకాడడం లేదు. ఇలా రోజురోజుకు మనుషుల్లో మానవత్వం మంటగలిసి పోతుంది... అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. ఇక్కడ ఓ తల్లి అలాంటి పని చేసింది. ఆమెకు వివాహమై పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కొడుకులు ఉన్నారు. 

 

 

 అయితే భర్త లేకపోవడంతో వేరే వ్యక్తితో వివాహేతర సంబంధానికి తెరలేపింది. ఇక ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి కి కూడా ఒక కొడుకు ఉన్నాడు. ఈ విషయం కాస్తా పెళ్లీడుకొచ్చిన కొడుకులకు తెలుసింది. దీంతో సదరు మహిళ కొడుకులు తన తల్లి అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి ని ఇంటికి పిలిపించి మరీ అతి దారుణంగా అంత మొందించారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... పల్లిపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అదే గ్రామానికి చెందిన  సుశీలకు ఏడు సంవత్సరాల నుండి అక్రమ సంబంధం నడుస్తోంది. అయితే ఈ అక్రమ సంబంధం పై పలువురు పెద్దలు ఇప్పటికే వీరిని హెచ్చరించారు. 

 

 

 అయితే తాజాగా అక్రమ సంబంధం పెట్టుకున్న ఇద్దరి మధ్య చిన్న వివాదం తలెత్తింది. ఈ సమయాన్ని అదునుగా భావించిన సుశీల కొడుకులు... దుర్గాప్రసాద్ నానీలు ఇద్దరూ వెంకటేశ్వర్లును చంపడానికి ప్లాన్ వేసారు. ఇక మామూలుగా వెంకటేశ్వర్ల ని  ఇంటికి పిలిపించి కర్రలతో దాడి చేసి అతని బాడీని  తీసుకెళ్లి కరకట్ట దగ్గర పడేసారు. ఇక విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు కొడుకు తన తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో  వెంకటేశ్వర్లు కొడుకు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: