ఇటీవల కాలంలో పెళ్లయిన తర్వాత ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కామన్ అయిపోయింది. అయితే ఇవే వాళ్ల పాలిట శాపాలుగా మారుతున్నాయి. అక్రమ సంబంధాల కారణంగా ఎన్ని దారుణ ఘటన లు జరిగినప్పటికీ ఈ వ్యవహారాలు మాత్రం తగ్గడం లేదు. కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న వివాహేతర సంబంధాలు.. నిండునూరేళ్ల జీవితాన్ని కర్కశంగా కాటేస్తున్నాయి. ఈ క్రమంలోనే విచక్షణా రహితంగా కూర్చున్న కొమ్మనే నరుకుంటున్నారు కొందరు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం కుటుంబంలోని పిల్లలు, ముసలి తల్లిదండ్రులకు దూరమవుతున్నాయి.
తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఆమె కొడుకులు దారుణంగా హత్య చేసిన ఘటన కృత్తివెన్ను పల్లిపాలెంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ల్లిపాలెం గ్రామానికి చెందిన అండ్రాజు వెంకటేశ్వర్లు(45) అదే గ్రామానికి చెందిన బొడ్డు సుశీల కు ఏడు సంవత్సరాలుగా విహేతర సంబంధం ఉంది. అయితే సుశీలకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొడుకులు కూడా పెళ్లీడుకొచ్చారు. అయితే భర్త లేకపోవడంతే వెంకటేశ్వర్లుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో ఈ విషయమై పలుమార్లు గొడవలు జరిగాయి.
పెద్దలు పంచాయితీలు పెట్టినప్పటికీ వెంకటేశ్వర్లు సుశీలతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. అయితే ఇటీవల వారిద్దరి మధ్య చిన్నచిన్న ఘర్షలు జరగడంతో ఇదే అదునుగా భావించిన సుశీల చివరకు కొడుకులు దుర్గ ప్రసాద్, నానిలతో కలిసే వెంకటేశ్వర్లును చంపడానికి ప్లాన్ వేశారు ఈ క్రమంలోనే తల్లి సహకారంతో వెంకటేశ్వర్లును ఇంటికి రప్పించి..దుర్గాప్రసాద్, నానిలు అతనిని కర్రతో కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత మృతుడు వెంకటేశ్వర్లును ద్విచక్ర వాహనంపై పక్కనే ఉన్న కరకట్ట పైకి తీసుకెళ్లి అక్కడ వదిలేసి వచ్చారు.
విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు కొడుకు తన తండ్రి వెంకటేశ్వర్లను ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అయితే అప్పటికే వెంకటేశ్వర్లు మృతి చెందాడు. దీంతో వెంకటేశ్వర్లు కుటుంబం సభ్యులు పోలీసులకు పిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసికుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలా అక్రమ సంబంధం పెట్టుకున్న వెంకటేశ్వర్లకు అదే శాపంగా మారి ప్రాణం తీసింది.