ఈ మధ్యకాలంలో మనుషులు ప్రాణాలకు కనీసం విలువ లేకుండా పోతుంది. ఎంతో సులభంగా కనీసం మానవత్వం లేకుండా... సాటి మనుషుల ప్రాణాలను గాల్లో కల్పిస్తున్నారు. ఇలాంటి ఘటనలు చూస్తుంటే మనుషులు మానవత్వం ఉందా లేదా అని అనుమానం  కలుగుతూనే ఉంటుంది. ఇక కొంతమంది అయితే కన్న ప్రేమను మరచి.. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను కడతేరుస్తున్నారు. భార్య భర్తల మధ్య  జరిగిన గొడవల్లో  క్షణికావేశంలో ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. అభం శుభం తెలియని చిన్నారులను కాటికి పంపిణీ చేస్తున్నారు. ఒకసారి క్షణికావేశంలో ప్రాణం తీసిన తర్వాత ఎంత పశ్చాత్తాప పడిన పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. 

 

 

 ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎంతోమంది తల్లులు తమ బిడ్డలను కడతేర్చేందుకు  కూడా వెనకాడడం. కొంతమంది ప్రియుడి మోజులో పడి కన్నబిడ్డనే హతమార్చేందుకు సిద్ధపడుతుంటే  ఇంకొంతమంది... వివిధ కారణాలతో క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని కాటికి పంపేందుకు వెనకాడడం లేదు. ఇలా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల చేస్తున్న చేష్టల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతో మంది. అభం శుభం తెలియని చిన్నారులు దగ్గర్నుంచి... అన్నీ తెలిసిన పెద్దవాళ్ళు వరకు.. ఆవేషంలో  తీసుకున్న నిర్ణయాల వల్ల ఎన్నో ప్రాణాలు ఇప్పటికే గాల్లో కలిసిపోయాయి. 

 

 

 ఇక్కడ తాజాగా ఇలాంటి ఘటన జరిగింది. క్షణికావేశంలో  ఓ తల్లి చేసిన పని పసిగుడ్డు ప్రాణం తీసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్ అలీఘర్ కి చెందిన రాహుల్ పింకీ దంపతులు. వీరిద్దరికీ మూడేళ్ల బాబు తో పాటు ఆరు నెలల పసి పాప కూడా ఉంది. అయితే తాజాగా భార్య భర్తల మధ్య గొడవ జరిగింది... హోలీ పండగ కి కొత్త బట్టలు ఎందుకు కొనివ్వలేదని పింకీ భర్తతో గొడవ పడింది. ఈ గొడవ అంతకంతకూ పెరిగి పోయి బాగా ముదిరిపోయింది. ఇంతలో  క్షణికావేశానికి లోనై నా భార్య పింకీ తన చేతిలో ఉన్న 6 నెలల పసిపాపను  నేలకేసి గట్టిగా కొట్టింది. దీంతో ఆ పసిగుడ్డు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై భార్య పింకీ పై భర్త రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: