ఇటీవల ఏపీ సీఎం జగన్ ను రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ స్వయంగా ఇంటికి వచ్చి కలిసిన సంగతి తెలిసిందే. వారి మధ్య ఏం చర్చలు జరిగాయన్నది రహస్యంగానే ఉంది. దీనిపై అనేక ఊహాగానాలు ఉన్నాయి. ఈ విషయంపై భేటీ జరిగినే రోజే ఏపీ హెరాల్డ్ అసలు గుట్టు బయటపెట్టింది. ఇంతకీ జగన్ ను ముఖేష్ కలవడానికి అసలైన కారణం ఏంటో తెలుసా అంటూ అసలు విషయం చెప్పేసింది.

 

 

పరిమళ్ నత్వానీ అనే ఎంపీకి రాజ్యసభ సీటు కోసం ముఖేష్ జగన్ వద్దకు వచ్చారని తెలిపింది. ఈ నత్వానీ ఏపీ కోటాలో త్వరలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయ్యే అవకాశం ఉందని చెప్పింది. ఇంతకీ ఈ నత్వానీ ఎవరో తెలుసా అంటూ అతని వివరాలు బయటపెట్టింది. ఈ నత్వానీ మొదట్లో వ్యాపారి... 1997లో రిలయెన్స్‌లో జాయినయ్యాడు.. రిలయెన్స్ వ్యాపార విస్తరణలో ఇతనిది కీలక పాత్ర. ధీరూభాయ్ అంబానీకి ఈ నత్వానీ సన్నిహితుడు. రిలయెన్స్ టెలికాం , పెట్రో కీలక ప్రాజెక్టుల అభివృద్ధిలో నత్వానీ వ్యూహం ఉంది.

 

 

ఈ నత్వానీ బీజేపీకి సన్నిహితుడు. 2008లో జార్ఖండ్ నుంచి తొలిసారి రాజ్యసభ సభ్యుడయ్యాడు.. తర్వాత 2014లోనూ బీజేపీ ఎంపీ అయ్యాడు. ఇప్పుడు మరోసారి ఎంపీ ఛాన్స్ కోసం ఏపీ వైపు చూస్తున్నాడు. ఈ విషయం కోసమే ఏకంగా ముఖేశ్ అంబానీ నేరుగా జగన్ వద్దకు వచ్చినట్టు తెలుస్తోందని ఏపీ హెరాల్డ్ విశ్లేషించింది. ఇప్పుడు ఏపీ హెరాల్డ్ చెప్పిందే నిజమైంది.

 

 

ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కోరామని ఝార్ఖండ్‌ స్వతంత్ర ఎంపీ పరిమల్‌ నత్వానీ అంగీకరించారు. సోమవారం పార్లమెంటు సెంట్రల్‌ హాలులో విలేకరులతో ఇష్టాగోష్ఠి సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. ప్రస్తుతం ఝార్ఖండ్‌ నుంచి కాంగ్రెస్‌, బీజేపీకు ఒక్కో సీటు వస్తున్న నేపథ్యంలో అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం లేదని.. అందుకే ముకేశ్‌ అంబానీతో అమరావతి వచ్చి జగన్‌ను కలిసినప్పుడు ఈ ప్రతిపాదన చేశానని నత్వానీ చెప్పారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: