ఈ మధ్యకాలంలో మంచి వాళ్ళు ముసుగులో ఉన్న కామాంధులు రెచ్చిపోతున్నారు. సమయం సందర్భం చూసి ఆడపిల్లలను లోబర్చుకొని కామ వాంఛలను తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువగా విద్యాసంస్థల్లో ఆడపిల్లలపై లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే కాస్త కామంతో కళ్లు మూసుకుపోయి... తమ దగ్గర చదువుకునే విద్యార్థుల పైనే కామవాంఛ తీర్చుకునేందుకు పశువుల్లా  మీద పడి పోతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ రోజుల్లో చాలానే తెర మీదకు వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు కాస్త... తన వద్ద చదువుకుంటున్న ఓ విద్యార్థినితో కామ క్రీడలకు తెరలేపాడు . 

 

 

 ఇక విద్యార్థినితో ఉపాధ్యాయులు చేస్తున్న కామ క్రీడ కు సంబంధించిన ఫోటోలు తీయడం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మైసూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంచివాడు ముసుగులో ఉన్న ఈ ఉపాధ్యాయుడు నీచత్వం తెలిసి ప్రస్తుతం జనం ఛీ  కొడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలూకా లోని రాంపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాంపూర్ గ్రామంలో ప్రభుత్వ హైస్కూల్లో ఉపాధ్యాయుడైన సిద్ధరాజు అలియాస్ సిద్దరామయ్య కు.. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. అయితే తన వద్ద చదువుకున్న ఓ పాత విద్యార్థిని.. మాయమాటలు చెప్పి మభ్యపెట్టి కామ వాంఛలు తీర్చుకునే వాడు ఇక్కడ గురువు ముసుగులో ఉన్న నీచుడు. 

 

 

ఇక ఆ ఫోటోలు తీసి వాటిని యువతికి  వాట్సప్ లో  పంపించాడు. ఇక ఈ ఫోటోలు కాస్తా పొరపాటున యువతి కాకుండా వేరే నెంబర్కు వెళ్లడంతో.. ఈ ఉపాధ్యాయుడి ముసుగులో ఉన్న కామాంధుడి యవ్వారం బయటపడింది. ఇక ఈ ఘోరం పై గ్రామస్తులు ఆగ్రహం తో పాఠశాల ముందు ధర్నాకు దిగడంతో సిద్ధరాజు గ్రామం నుండి పరారయ్యాడు. గత కొద్ది రోజులుగా యువతిని ఇంటికి రప్పించుకునే వాడు అంటూ గ్రామస్తులు తెలిపారు. గురు ముసుగులో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఈ కామాంధుడు అరెస్టు చేసి కఠిన శిక్ష విధించాలి అంటూ గ్రామస్తులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: