కన్నకూతురిలా చూసుకోవలసిన కోడలిని, ఓ దుర్మార్గుడు తన తీవ్రమైన కామ వాంఛలతో ఆమె నిండు జీవితాన్ని పాడు చేశాడు. ఆమె అమాయకత్వాన్ని పసిగట్టిన సదరు వ్యక్తి, దాన్ని అలుసుగా చేసుకుని  ఒకసారి కాదు పలుమార్లు ఆమెపైన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి బొబ్బిలి సీఐ ఇ. కేశవరావు తెలిపిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి...

 

పాత బొబ్బిలి ప్రసాద్‌నగర్‌ కాలనీలో 20 ఏళ్ల ఎస్సీ వివాహిత భర్తతో కలసి నివాసముంటోంది. ఆదివారం తన భర్త పనికి వెళ్లడంతో ఆమె ఒక్కతే ఇంటి వద్ద ఉండటం గమనించిన తన చినమామ అదను చూసుకొని,  ఇంటిలోకి ప్రవేశించి అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా... ఆమె కేకలు వేయబోయింది. అయితే ఆమె అరుపులు బయటకు వినపడకుండా.. ఆ కామాంధుడు ఆమె నోటిలో గుడ్డలు కుక్కి అఘాయిత్యం చేశాడు. అనంతరం ఆ నీచుడు పారిపోవడంతో ఆమె ఏడుస్తూ.. బయటకు వచ్చింది. 

 

చెప్పుకునేందుకు ఇరు ప్రక్కల ఎవరూ లేకపోవడంతో, సమీపంలో ఉన్న ఇంటి వద్దకెళ్లి వారికి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంది. గతంలో కూడా ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడని ఏంటో ఆవేదనతో తెలిపింది. బాధితురాలి బాధను అర్ధం చేసుకున్న వారు, ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పి, పోలీసులకు సమాచారం అందజేశారు. అలాగే బాధితురాలి భర్తకు కూడా తెలియజేశారు. దీంతో బొబ్బిలి ఏఎస్పీ గౌతమీ శాలి, సీఐ కేశవరావు సిబ్బందితో కలసి గ్రామానికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. 

 

నిందితుడు పరారీ కావడంతో సోమవారం అతడ్ని పట్టుకుని కేసు నమోదు  చేశారు. "సాటి సమాజం సిగ్గుపడే సంఘటన ఇది. ఇలాంటి మానవ మృగాలకు తగిన శాస్తి చేయాలి. ఇది చాలా హేయమైన సంఘటన. కేసు వివరాలను ఎస్పీ గారి దృష్టిలో పెట్టాం. ఆలస్యం చేయకుండా కేసు నమోదు చేయాలన్నారు. అదేవిధంగా చార్జిషీటుతో రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడ్ని రిమాండ్‌కు తరలించాం." అని పోలీసులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: