ఈ మధ్య కాలంలో చాలా మంది మహిళలు భర్తల  వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న  చూస్తున్నాం. ఇక భార్యలు  కూడా భర్తలను ఎంతగానో విధిస్తారని చిత్రహింసలు పెడుతున్నారని.. కొంతమంది చెబితే వింటుంటాం..  కొంతమంది సినిమాల్లో  చూస్తుంటారు. కానీ ఇక్కడ జరిగిన ఘటన మాత్రం భార్య వేధింపులకు భర్త ఎంతగా బాధపడతాడు అనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. భార్య అత్తమామలు వేధింపులతో పెట్రోల్  పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే భార్య అత్తమామలు నుంచి వేధింపులు ఎదురవుతుంటే ఎన్నో రోజుల పాటు సహించిన భర్త ఓపిక నశించి ఆత్మ హత్య చేసుకుని... బలవన్మరణానికి పాల్పడ్డాడు.

 

 

 వివరాల్లోకి వెళితే... ఉప్పల్ ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన ఆనంద్ లతలు నాలుగు సంవత్సరాల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కూతురు కూడా ఉంది. అయితే నెల క్రితం లత తన భర్తతో సహా కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇక ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ కూడా జరిగింది. దీంతో ఆనంద్ బయటికి వెళ్ళగానే భార్య లత కూతుర్ని తీసుకుని ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు.. అప్పటికే మద్యం తాగి వచ్చిన ఆమె ఇంటికి తాళం ఉండడం చూసి చుట్టుపక్కల వెతికాడు ఆ తర్వాత అత్తారింటికి వెళ్లి భార్య గురించి ఆరా తీయగా... అత్తమామలు కూడా తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. 

 

 

 దీంతో భార్య చెప్పిన మాట వినక... ఎంతో గౌరవం ఇవ్వాల్సిన అత్తమామలు కూడా తనను దారుణంగా తిట్టడంతో తీవ్ర మనస్థాపం చెందాడు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఆనంద్... బాటిల్ తో పెట్రోల్ తీసుకుని... అత్తమామల ముందే ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు మంటలు ఆర్పీ...  చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: