ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజలను ప్రాణాంతకమైన వైరస్ ప్రాణభయంతో వణికిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో మూడు కరోనా పాజిటివ్  కేసులు నమోదు... అవ్వగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయిపోయాయి. అయితే తెలంగాణలోని హైదరాబాద్లో పలు కరోనా  అనుమానితులు ఉన్నప్పటికీ వారికి ఎవరికీ కరోనా  లేదు అని తెలింది.  కానీ తాజాగా బెంగళూరు నుంచి వచ్చిన ఓ హైదరాబాద్ వాసికి  వైరస్ ఉన్నట్టుగా నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా తెలంగాణ ప్రజలందరూ ఉలిక్కిపడ్డారు. అంతేకాకుండా ఆ వ్యక్తి కారణంగా  మరింత మందికి కరోనా వచ్చి  ఉండవచ్చుననే వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తుండడంతో తెలంగాణ  ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

 

 అయితే హైదరాబాద్ నగరంలో కరోనా  పాజిటివ్ కేసు నమోదు కావడంతో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను  ఏర్పాటు చేస్తోంది. అంతే కాకుండా కరోనా  వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతుంది. ఇక కరోనా వైరస్ సోకిన వ్యక్తి బంధువులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది ప్రభుత్వం. అయితే కరోనా వైరస్ తెలంగాణలో కూడా ప్రవేశించటం పై  పలువురు ప్రముఖులు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

 


 ఈ క్రమంలోనే తాజాగా మెగా బ్రదర్ సినీనటుడు జనసేన నేత నాగబాబు కరోనా వైరస్ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ భూమ్మీద మనిషి అనే జీవి పూర్తిగా చస్తే ఈ భూమి ప్రకృతి వాతావరణం అద్భుతంగా ఉంటాయి అంటూ నాగబాబు అభిప్రాయపడ్డారు. మిగిలిన జీవరాసులు కూడా చాలా సంతోషంగా జీవిస్తాయి అంటూ నాగబాబు తెలిపారు. సర్వ జీవరాశులను ప్రకృతి ధర్మాలకు లోబడి బతుకుతున్నాయి అని తెలిపిన నాగబాబు... కరోనా  వైరస్ ఒక్క మనిషి తప్ప అంటూ ట్వీట్ చేశారు. అయితే ప్రస్తుతం నాగబాబు చేసిన ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక దీనిపై అటు నెటిజన్లు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు. మీరు అంటున్న మనుషుల్లో మీరు కూడా ఉన్నారు కదా నాగబాబు గారు అంటూ కౌంటర్ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: