ఆయనో సాఫ్ట్వేర్ ఇంజినీర్. నెలకు రూ.70 వేల జీతంతోపాటు ఇంటి అద్దెలు రూ.20 వేల వరకు వస్తుంటాయి. ప్రస్తుతం ఆయన ఉంటున్న ఇల్లు విలువ సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుంది. సమీపంలోని వెంకటేశ్వరకాలనీలో ప్రదీప్కు 200 గజాల స్థలం ఉంది. అతడి తండ్రికి ఊరిలో పదెకరాల భూమితో పాటు ఓ రైస్మిల్లులో వాటాలు ఉన్నాయి. అయితే ఆయనకు రూ.22 లక్షల అప్పు ఉంది. కేవలం ఈ అప్పు కారణంగానే ఆయన చనిపోయాడని తెలుస్తోంది. అంతేకాదు...తన భార్యా పిల్లలకు సైతం విషపదార్థం తాగించి వారి జీవితాలకు సైతం ముగింపు పలికారు.
హైదరాబాద్లో జరిగిన ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళితే, నల్లగొండ జిల్లా నేరెడుగొమ్ముకు చెందిన కొట్ర యాదయ్య, కలమ్మ దంపతుల కుమారుడైన ప్రదీప్కుమార్ (36) వివాహం 2012లో నాగర్కర్నూ ల్ జిల్లా కొండారెడ్డిపల్లికి చెందిన స్వాతి (28)తో జరిగింది. వీరికి కుమారులు కల్యాణకృష్ణ (6), జయకృష్ణ (ఏడాదిన్నర) ఉన్నారు. ప్రదీప్కుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాగా, స్వాతి ఎమ్మెస్సీలో గోల్డ్మెడలిస్ట్. రెండేండ్లపాటు బెంగళూరు టీసీఎస్లో పనిచేసి ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఐబీఎంలో నెలకు రూ.70 వేల జీతంతో ప్రదీప్ ఉద్యోగం చేస్తున్నారు. సాఫ్ట్వేర్గా పనిచేస్తూనే సొంతంగా ఎదిగేందుకు వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టారు.
అయితే, వ్యాపారంలో నష్టాలతో మనోధైర్యం కోల్పోయిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణానికి ఒడిగట్టాడు. భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్యకు పాల్పడ్డారు. ‘నాన్నా.. మీకు నేను రాసే చివరి సందేశం ఇదే అనుకుంటా. మీకు ఏదేదో చెప్పాలనుకున్న. చెప్పలేక పోతున్న. నన్ను క్షమించు నాన్న. నాకు ఇంతకంటే మార్గం కనిపించలేదు. నీ మంచి చెడులు చూసుకోవాల్సిన నేనే మిమ్మల్ని వదిలి వెళ్లి పోతున్నా. లైఫ్లో ఏదో చేయాలని, జాబ్పై డిపెండ్ అవ్వొద్దనే ఉద్దేశంతో.. నాకంటూ ఓ కంపెనీ ఉండాలనే ఆలోచన. డబ్బులు సంపాదించి నాకున్న హోంలోన్ అయిపోగొట్టాలి అనే ఆలోచనలతో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న. పర్సనల్ లోన్ తీసుకొని హోంలోన్ను ఎల్ఐసీకి మార్చి.. రూ.22 లక్షలు తీసుకొని చాలా పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకున్న. తిరిగి చూస్తే అప్పు తప్ప ఏమీ కనిపించలేదు. ఒకడు నా ఇంటికి వచ్చి నిలదేసే దాక ఎదురు చూడలేను. ఎంతో ప్రేమతో ఇల్లు కట్టుకున్న. ఇది నాకు అమ్మ ఉంచిపోయిన జ్ఞాపకంగా భావించాను. ఇంతగా అప్పులైన విషయం స్వాతికి కూడా తెలియదు. ఎవరికి చెప్పాలో అర్థం కాదు.. ఎలా తీర్చాలో దారి దొరకడం లేదు’ అంటూ సూసైడ్నోట్ రాశారు.