వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా నేడు చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.. అయన ఆడే దొంగనాటకాలు.. దొంగ ప్రేమలను ఒక్క తవత్ లో చెప్పేసారు. తక్కువ కులాల వారు అంటే చంద్రబాబుకు ఎప్పుడు చులకన భావనే అని అయన అన్నారు.. అంతేకాదు.. చంద్రబాబు తన వర్గం తప్ప మిగితా కులాల వారు అధికార పీఠం దరిదాపులకు రాకుండా చేశాడు అంటూ మండిపడ్డారు.. 

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. 'అంగిట బెల్లం ఆత్మలో విషం’ అనేది చంద్రబాబు నైజాన్నివర్ణించడానికే పుట్టింది. పైకి ఎక్కడలేని ప్రేమ నటిస్తాడు.చేసేవి మాత్రం బీసీలను అణగదొక్కే పనులు. బీసీలు హైకోర్టు జడ్జిలుగా, ఉన్నత స్థాయి పదవుల్లో పనికి రారంటాడు. తన వర్గం తప్ప బీసీలు ఎప్పటికీ అధికార పీఠం దరిదాపులకు రాకుండా చేశాడు.'' అంటూ ట్విట్ చేశారు.  

 

మరో ట్విట్ లో ఇలా స్పందించారు.. అణగారిన వర్గాల పట్ల బాబు ద్వేషం మరోసారి బైటపడింది. వారిని వోట్ బ్యాంక్ గా చూడటం తప్ప రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేర్చాలన్న చిత్తశుద్ధి ఏనాడూ లేదు. స్థానిక సంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 59.85% రిజర్వేషన్ల అమలుకు సీఎం జగన్ గారు నిర్ణయిస్తే కోర్టులో కేసు వేయించి కొట్టేయించాడు.'' అంటూ మండిపడ్డారు విజయసాయి రెడ్డి. 

 

ఈ ట్విట్లు చుసిన నెటిజన్లు కూడా ఓ రేంజ్ లో మండిపడుతున్నారు.. ఏ ట్విట్ కు ఓ నెటిజన్ స్పందిస్తూ.. ''అది చంద్రబాబు నాయుడు గారి నైజo. అందుకే వారిని ప్రజలు చిత్తుగా ఓడించి 23 సీట్స్ కే పరిమితం చేశారు. అణగారిన వర్గాలకు వారు ఏ నాడూ మంచి చేయలేదు. చిన్న వయసు అయినా జగన్ మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు చిత్తశుద్ది పట్టుదలతో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది జగన్ గారి నైజం.'' అంటూ ట్విట్ చేసారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: