కరోనా ఎఫెక్ట్ పెరిగిపోతోంది. ఇండియాలో కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తెలంగాణ,ఏపీలోనూ అప్రమత్తం అవుతున్నారు. హైదరాబాద్ లో కరోనా ఖరారైలన వ్యక్తికి చికిత్స జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ కరోనా ప్రభావం విశాఖ పట్నానికీ తాకింది.

 

 

అయితే ఈ తాకిడి కరోనా వైరస్ సోకడం తో కాదు.. సుమా.. కరోనా ఎఫెక్ట్ తో విశాఖలోని ఓ బ్రహ్మాండమైన కార్యక్రమం వాయిదా పడింది. అసలు విషయం ఏంటంటే.. విశాఖ లో ఈనెల 18 నుంచి అనేక దేశాలతో కూడిన నౌకా దళాల సంయుక్త విన్యాసాలు జరగాల్సి ఉన్నాయి.

 

 

ఈ విన్యాసాల కోసం విశాఖలోని నౌకా దళం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.అయితే కరోనా ఎఫెక్టుతో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ తీవ్రంగా ప్రభావింతం అవుతోంది. బహుళ దేశాల నౌకా దళాల సంయుక్త విన్యాసాలతో కూడిన మిలన్ 2020 కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నారు.

 

 

ఇప్పటికే ఈ విన్యాసాల కోసం తూర్పు నౌకా దళం భారీగా ఏర్పాట్లు చేసింది. కానీ కరోనా ప్రభావంతో విదేశాల నుంచి రాక పై నిషేధాన్ని కేంద్రం అమలు చేసింది. దీనివల్ల ఈ విన్యాసాలకు 27 దేశాల నుంచి హాజరు కావాల్సిన నౌకా దళాల సిబ్బంది రాకకు ఇబ్బంది ఏర్పడింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: