సమాజంలో రోజురోజుకు మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. ఎవరికి వారు అక్రమ సంబంధాల ఉచ్చులో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మితిమీరిన కోరికలతో విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడుతున్న వారు ప్రాణాలు తీయడం లేదా... ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చేస్తున్నారు. వివాహేతర సంబంధాల వల్ల ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయో ? ప్రతిరోజు మీడియాలో వస్తున్న వార్తలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రియుడిని పెళ్లి చేసుకోవటానికి మాజీ ప్రియుడు అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో మాజీ ప్రియుడ్ని దారుణంగా హత్య చేయించింది.
ఉత్తరప్రదేశ్లో ఇటీవల నేరాలు, ఘోరాలకు లెక్కేలేదు. అక్కడ ప్రతి రోజు హత్యలు, అత్యాచారాలు చాలా కామన్ అయిపోయాయి. బరేలీకి చెందిన ఉమా శుక్లా అనే యువతి 2014లో భర్తతో విడిపోయి వేరుగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఆమెకు యోగేశ్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే తన సోదరికి పెళ్లి చేశాక పెళ్లి చేసుకుందామని చెప్పడంతో వీరి పెళ్లి వాయిదా పడింది. ఈ క్రమంలోనే ఆమె సునీల్ శర్మ అనే మరో వ్యక్తితో పరిచయం పెంచుకుని అతడిని పెళ్లాడాలనుకుంది. ఇందుకోసం ఆమె మాస్టర్ ప్లాన్ వేసింది.
కొత్త ప్రియుడితో పెళ్లికి పాత ప్రియుడు ఎక్కడ అడ్డు వస్తాడో ? అని భావించిన ఆమె ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని భావించింది. ప్రియుడితో కలిసి యోగేశ్ హత్యకు ప్లాన్ వేసింది. కొత్త ప్రియుడితో కలిసి వేసిన స్కెచ్లో భాగంగా ఆమె యేగేశ్ను రాత్రి వేళ ఓ నిర్మానుష్య ప్రాంతానికి రప్పించింది. అక్కడకు యోగేశ్ అక్కడికి రాగానే కళ్లలో కారం చల్లి, గొంతుకోసి చంపేశాడు సునీల్. అతడు చనిపోయాడని డిసైడ్ అయ్యాక ఆ డెడ్ బాడీపై పెట్రోల్ పోసి తగుల బెట్టారు. అయితే ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు కేవలం 24 గంటల్లోనే వీరిని అరెస్టు చేశారు.