దేశంలో ఆడవారిపై ప్రతిరోజూ ఎక్కడో అక్కడ అఘాయిత్యాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్న కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు మహిళలు, వృద్దలులపై చివరికి చిన్నారులపై అత్యాచారాలు మాత్రమే కాదు హత్యలకు పాల్పపాడుతున్నారు.  తాజాగా ఇద్దరు గిరిజన బాలికలపై సామూహిక అత్యాచారం సంఘటన విశాఖ జిల్లా అరకులోయ మండలంలో సంచలనం సృష్టించింది.  బాధిత బాలికలలో ఒకరు మంగళవారం అరకులోయ పోలీసులకు ఫిర్యాదు చేసారు.  వివరాల్లోకి వెళితే.. మండలంలోని బొండాం పంచాయతీ రంపుడువలస గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజన బాలికలు బహిర్భూకి వెళ్లారు. 

 

రేగ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు అరకు ఉత్సవ్‌కు తీసుకెళ్తామని నమ్మబలికారు. అందులో ఓ యువకుడు  బాలికలకు మాయమాటలు చెప్పి బలవంతంగా వాహనంలోకి ఎక్కించాడు. అరకు ఉత్సవ్ పేరిట వాహనంలో ఇద్దరు బాలికలను ఎక్కించిన వీరు సుంకరమెట్ట వైపునకు తీసుకెల్తుండడంతో అనుమానం వచ్చిన బాలికలు యువకులను నిలదీసారు. అయితే ఉత్సవ్ కు వెళ్తున్నామని చెప్పి వేరే రూట్ లో తీసుకు వెళ్తున్న ఆ యువకులపై అనుమానం వచ్చి గట్టిగా నిలదీశారు. దాంతో పక్కనే ఉన్న స్మశానంలోకి ఆ ఇద్దరు బాలికను బలవంతంగా తీసుకు వెళ్లిసామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అదే సమయంలో అటువైపు వెళుతున్న ఒక పాస్టర్ దీనిని గమనించి గట్టిగా అరుపులు వేస్తూ.. సంఘటన స్థలానికి చేరుకునేలోగా యువకులు పరారయ్యారు.  

 

పోలీసులు ఇచ్చిన సలహాతో బాధిత బాలికలను పాస్టర్ వారి తల్లిదండ్రులకు అప్పగించారు.  అయితే విషయం తెలుసుకున్న ఆ బాలికల తల్లిదండ్రులు తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.   కాగా,  ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం చేసిన ఐదుగురు యువకులలో గొల్లోరి గోపి అనే యువకుడితో పాటు వాహన డ్రైవర్ హరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు.  అయితే నింధితులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని బాలకల బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేయడంతో వారిని త్వరలో పట్టుకొని శిక్షిస్తామని పోలీస్ అధికారులు హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: