అవును.. నిజమే.. కరోనా దేన్నీ వదలట్లేదు.. కడకు క్రికెట్ ను కూడా వెంబడిస్తోంది. కరోనా వైరస్‌ కారణంగా టోక్యో 2020 ఒలింపిక్స్‌ వాయిదా పడే అవకాశం మెండుగా ఉన్నట్లు క్రీడా నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయంగా ఇప్పటికే  జరగాల్సిన క్రీడా పోటీలు, ఒలింపిక్‌ సంబంధిత ఈవెంట్లు రద్దయ్యాయి.  భారత్‌ వేదికగా ఈ నెల 29న ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌పై కూడా కరోనా వైరస్‌ ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు తాజా సమాచారం.  

 

IHG

 

ఈ సంవత్సరం జులై 24 నుంచి ఆగస్టు 9వరకు  ప్రపంచ స్థాయి క్రీడలు జరగాల్సి ఉంది. మామ్మూలుగా మ్యాచ్ కు ఎక్కువమంది అటెండ్ అయితే బావుంటుంది, కానీ ఇపుడు ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరవ్వడమే ఇబ్బందులు కలిగించే అంశం.  భారత్‌లో ఇప్పటికే 28  కరోనా కేసులు  నమోదైన నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి.  అయితే, ఈ నెల 12న ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌తో పాటు ఐపీఎల్‌కు కరోనా వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ చెప్పినప్పటికీ.. ఎవరి అనుమానాలు వారికున్నాయి..

 

మొత్తానికి ఆ విషయం గురించి సమావేశంలో చర్చించలేదని అతను తెలిపాడు. ప్రస్తుతానికి వైరస్‌ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ కూడా వెల్లడించాడు. కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.  క్రికెట్‌ మ్యాచ్‌లను చూసేందుకు వేలాది మంది స్టేడియాలకు రావాల్సి ఉండటంతోనే అసలు టెన్షన్ మొదలైంది. 

 

IHG

 

ఇలాంటి పరిస్థితులలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు  జనసమూహాలతో కూడిన ఈవెంట్ల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిస్తుందో లేదో కాస్త డవుట్. మార్చి 12 నుంచి ధర్మశాల వేదికగా భారత్‌, సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే జరగనుంది. బీసీసీఐ కరోనా వైరస్‌  కేసుల గురించి బీసీసీఐ  పర్యవేక్షిస్తోందని దాదా తెలిపాడు. షెడ్యూల్‌ ప్రకారమే సౌతాఫ్రికా భారత్‌లో పర్యటిస్తుందని, ఐపీఎల్‌ కూడా నిర్వహిస్తామని బీసీసీఐ అధికారి ఒకరు తెలపడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: