ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా అక్రమ సంబంధాలు తెర మీదకు వస్తున్నాయి. ఇలా రోజురోజుకు అక్రమ సంబంధాల నేపథ్యంలో సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి వస్తుంది. హాయిగా సాగిపోతున్న దాంపత్యంలో మూడో వ్యక్తి రావడంతో ఈ అక్రమ సంబంధాలు వస్తున్నాయి. ఈ అక్రమ సంబంధాల నెపంతో  హత్యలు ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. ఇంకొంతమంది భర్తను పిల్లలను వదిలేసి ప్రియుడితో  పరారై పోతున్నారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది కానీ ఇక్కడ పరారైంది... 19 ఏళ్ల యువకుడితో 45 ఏళ్ల మహిళ. ఆ మహిళకు భర్తతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అవన్నీ పట్టించుకోకుండా సదరు మహిళ పరారైపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

 

 

 వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని రాయచూర్ లో ఈ అవమానియ  ఘటన చోటుచేసుకుంది. రాయచూర్ కు చెందిన నిర్మల అనే మహిళ ఆటో డ్రైవర్ గా పని చేస్తోంది. ఇక నిర్మల కొడుకు నరేష్ స్థానికంగా ఓ ఉడిపి హోటల్ లో పని చేస్తున్నాడు. అదే హోటల్లో చంద్రిక అనే 45 ఏళ్ల మహిళ పని చేస్తుంది. అయితే రోజు హోటల్లో వీరిద్దరూ బాగా మాట్లాడుకునేవారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ... గత వారం రోజుల నుండి నరేష్ కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రులు బంధువులు తెగ కంగారు పడిపోయారు. పలువురు బంధువులు తెలిసినవాళ్లని సంప్రదించిన ఆచూకీ మాత్రం లభించలేదు. అదే సమయంలో వారం రోజుల నుండి చంద్రిక అనే మహిళా  కూడా పనికి రావడం లేదని తెలియడంతో.. సదరు మహిళ తన కొడుకును కిడ్నాప్ చేసి ఉంటుందని నిర్మల భావించింది. 

 

 

 అయితే దీని పై ఆరా తీసిన తల్లి నరేష్ చంద్రిక కలిసి ఎక్కడికొ  వెల్లడి కావడంతో షాక్కి గురైంది. దీంతో నరేష్ తల్లి నిర్మల పోలీసులకు ఫిర్యాదు చేసింది. చంద్రిక తన కొడుకుకు ఏవో మాయమాటలు చెప్పి.. కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయింది  అంటూ ఫిర్యాదులో పేర్కొంది నిర్మల. మరోవైపు చంద్రికకు భర్త ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఈ కేసు విషయమై చంద్రిక భర్తను పోలీసులు విచారించగా తన భార్య  ఎక్కడికి వెళ్ళిందో తనకు తెలియదని ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశాడు. కాగా ప్రస్తుతం వీరిద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: