వామ్మో ! అచ్చం సినిమా కథలాగానే ఉంది. థియేటర్లో కూర్చుని సినిమా చూస్తున్నట్టే వుంది వార్త చూసిన వారికి. మరి అంత గొప్పగా ప్లాన్ చేసింది ఈ ఇల్లాలు. ప్రియుడి మోజులో పడిపోయి తెగించేసింది. మంచి, భయం ఏమి లేకపోయింది. తాళి కట్టిన భర్తని హత్య చేయడానికి సిద్ధం అయ్యిపోయింది ఈ భార్య. ఛీ...నిజంగా చేసినది ఘోరం. ఆ దొంగ ప్రియుడి మాయలో పడి తెగించేసింది. గొప్ప చిక్కులోనే పడింది చివరికి.

 

ప్రియుడి  మోజులో పడి ఒక ప్లాన్ వేసింది నిజంగా వెంటే షాక్ అవుతారు. భర్తని చంపడానికి సిద్ధం అయ్యిపోయింది. వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి. తాడూరు మండలంలోని పర్వతాయిపల్లి గ్రామానికి చెందిన భాగ్యమ్మకి దాసరి యాదయ్య (25 ) తో వివాహం జరిగింది. అయితే అదే గ్రామానికి చెందిన యోగితో ఆమె వివాహేతర సంబంధం నడుపుతోంది.

 

ఈ విషయం భర్తకి తెలిసిపోయి నిత్యం గొడవలు పడడం జరిగింది. అయితే ఈ విషయంకి ఫుల్స్టాప్ పెట్టాలని భార్య నిర్ణయించుకుంది. తన ప్రియుడి సాయంతో కుట్రకి సిద్ధం అయ్యింది భాగ్యమ్మ. అయితే మద్యం మత్తులో ఉన్న యాదయ్యని చెర్లటిక్యాల వద్ద తుమ్మలసూగూరు గ్రామాల మధ్య ఉన్న కే.ఎల్.ఐ. కాలువ దగ్గర తాడుతో మెడని బిగించి హత్య చేసారు సినిమాటిక్ స్థాయిలో .

 

హత్య చేసాక శవాన్ని ఆ కాలువలో పడేసారు. హత్య చేసిన భాగ్యమ్మని, యోగిని పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే ఇది ఇలా ఉండగా ప్లాస్టిక్ సర్జరీ చేసి ప్రియుడి ముఖానికి భర్త ముఖం పెట్టాలన్న ఉద్దేశంతో హత్య చేసిన స్వాతి పోలీసులకి చిక్కింది. కటకటాలపాలైన ఆమెని కలవడానికి కానీ ఆశ్రయం కల్పించడానికి కానీ బంధుమిత్రులు, కుటుంబికులు కానీ ముందుకి రావడం లేదు. నిజంగా నేటి హత్యలు సినిమాటిక్ స్థాయిలో ఉండడం నిజంగా ఆశ్చర్యమే కదా..

మరింత సమాచారం తెలుసుకోండి: