టీడీపీ అధినేత చంద్రబాబుపై గతంలో చాలా ఆరోపణలు ఉండేవి.. వాటి కారణంగానే ఆయన 2019లో అధికారం కోల్పోయారు. అందులో ప్రధానమైంది.. ఆయన తన సొంత సామాజిక వర్గమైన కమ్మవారి కోసమే పని చేశారని.. కమ్మ కులానికి బాగా ప్రాధాన్యం ఇచ్చారని.. అన్ని రంగాల్లోనూ కమ్మ వారికే అన్నీ కట్టబెట్టారని అంటారు.

 

 

కమ్మ కులం ప్రభావం కారణంగా.. కమ్మ వారికి వ్యతిరేకంగా అన్ని వర్గాలు ఏకమై చంద్రబాబు అధికారం నుంచి దూరం కావడానికి కారణమయ్యాయని అంటుంటారు. కానీ ఇప్పుడు ఓ వింత ఆరోపణ వస్తోంది. అసలు చంద్రబాబు కమ్మ కులం పరువు తీసేశారట. కమ్మ జాతి పరువును తీస్తున్న నీచ చరిత్ర చంద్రబాబుదట. ఈ మాటలు అంటున్నది ఆయన అత్తగారు లక్ష్మీ పార్వతి.

 

 

 

చంద్రబాబు గతంలో భూమి సమీకరణ పేరుతో కమ్మవారిని కూడా వదలిపెట్టలేదంటున్నారామె. మళ్లీ ఇప్పుడు ఆ కమ్మవారి పరువు తీసేలా వ్యవహరిస్తున్నారని లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును నమ్మి అంతా కాక పోయినా, ఇంకా కొంతమంది కమ్మ వారు ఆయన వెంట తిరుగుతున్నారని ఇది దురదృష్టకరం అని లక్ష్మీ పార్వతి అన్నారు.

 

 

చంద్రబాబు చివరకు.. తన భార్య, కోడలిని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి వెనుకాడని వ్యక్తి అంటూ చంద్రబాబు తీరుపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు తనను అడ్డం పెట్టుకుని అప్పట్లో ఎన్.టి.ఆర్. మరణించేలా చేశారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు నాయుడును అల్లుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానని లక్ష్మీపార్వతి అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: