అమరావతి ఉద్యమం కోసం ఆమధ్య చంద్రబాబు విరాళాలు పోగు చేసిన సంగతి తెలిసిందే. ఆయన తన రాజకీయ జీవితంలోనే తొలిసారిగా జోలె పట్టి విరాళాలు సేకరించారు. నడి రోడ్డుపై తిరుగుతూ జోలె పట్టి డబ్బులు పోగు చేశారు. అంతే కాదు.. స్వయంగా తన భార్యతో రెండు బంగారు గాజులు విరాళంగా ఇప్పించారు. ఇదంతా అమరావతి ఉద్యమం కోసమే అన్నారు చంద్రబాబు.

 

 

అయితే చంద్రబాబు కేవలం 2 గాజుల పెట్టుబడితో చాలా బంగారం సంపాదించాడని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి ఆరోపిస్తున్నారు. ఆమె ఏమంటున్నారంటే.. “ ఆఖరికి భువనేశ్వరిని కూడా చంద్రబాబు ఈ అమరావతి ఉద్యమంలోకి లాగారు. ఆమె గాజులు కూడా లాక్కున్నాడు. రెండు గాజులు తన భార్య చేత విరాళంగా ఇప్పించిన చంద్రబాబు.. చివరకు 24 గాజులు సంపాదించాడు. ఉంగారాలు 29, చెవి పోగులు 41, బ్రాస్‌లెట్స్‌ 2, బంగారు గాజులు 3, నల్లపూసల గొలుసులు రెండు తీసుకున్నారు. వెండీ పట్టీలు, వెండి గొలుసులు లాక్కున్నాడు. ఇవన్నీ కూడా ఆడవాళ్లవే.. అంటూ ఉద్యమంలో కొత్త కోణం వెలికి తీశారు.

 

 

ఉద్యమం చేసే వారు తన డబ్బులు ఖర్చు పెట్టాలి. అవినీతితో లక్షల కోట్లు సంపాదించాడు. ఆ డబ్బు పెట్టవచ్చు కదా? అవినీతి సొమ్మంతా విదేశీ బ్యాంకుల్లో దాచుకుంటాడు. అమరావతి రైతులకు ఆ డబ్బులు ఖర్చు చేయవచ్చు కదా? ఆ రైతులతో రూ.70 లక్షలు వసూలు చేసి అమాయక రైతులను రోడ్డుపైకి లాగారు. ఆ రోజు ఇందిరాగాంధీని నమ్మి టికెట్ ఇస్తే..ఆమెను మోసం చేసి ఎన్టీఆర్‌ పంచన చేరాడు. ఎన్టీఆర్‌ పిల్లనిస్తే..మామకే ద్రోహం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. లక్ష్మీ పార్వతిని అడ్డుపెట్టుకొని నీచమైన రాజకీయాలు చేసి లక్ష్మీ పార్వతిని రోడ్డుపైన పారేసిన నీచమైన వ్యక్తి చంద్రబాబు.. అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు లక్ష్మీపార్వతి.

 

ఈ రోజు కూడా అంతే మళ్లీ ఆడవాళ్లను అడ్డుపెట్టుకొని అమరావతి ఉద్యమం అంటున్నాడు. ఆడవాళ్లనే ఎందుకు వాడుకుంటావ్‌? నికృష్టమైన రాజకీయం చంద్రబాబు తప్ప మరెవ్వరూ చేయలేరు. వైఎస్ జగన్ నాలుగున్నర లక్షల ఉద్యోగాలు ఇవ్వడం గర్వకారణం. మాకే కాదు ప్రపంచానికే గర్వకారణం. మహిళలకు దిశ చట్టం, అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లలకు చదువు చెప్పించాలనే మంచి సంకల్పం అని జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారామె.

 

మరింత సమాచారం తెలుసుకోండి: