భారత దేశంలో అమానవీయ సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి. అవి రోజు రోజుకు ఎక్కువ అవుతునే ఉన్నాయి. వాటిలో వావి వరుసలు లేకుండా లైగింక దాడులు ఒకటైతే.. మరొకటి కుట్రలు కుతంత్రాలతో వరకట్న వేధింపులు.. అసలు వరకట్నం అనేది కొత్తగా ఒకటైన జంటకి కాస్త అండగా ఉండాలని వరకట్నం ఇచ్చేవారు పూర్వకాలంలో. కానీ.. అది ఇప్పుడు ఎక్కువై పోయింది పెళ్ళి చేస్తున్నాం అంటే అదొక నిబంధన లాగా తయారయింది. దేశంలో వరకట్న వేదింపులు చాలానే జరుగుతున్నాయి.

 

 

అయితే.. తాజాగా కర్ణాటకలోని మైసూరు జిల్లాలో ఓ ఘటన చోటు చేసుకుంది. వరకట్నం కోసం భర్త తన భార్యతో అతి దారుణంగా ప్రవర్తించి ఆమె నిద్ర పోతున్నప్పుడు ఆమెకు ఉరి వేసి చంపేశాడు. ఈ ఘటన మైసూరు జిల్లాలోని హుణసూరు తాలుకాలోని సోమనాథపుర గ్రామంలో కలకలం రేపింది. మృతురాలి భర్త హుణసూరులోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో నిందితుడు వెంకటప్ప సహాయ అధికారిగా పని చేస్తున్నాడు. భార్య నాగవేణి 41 సంవత్సరాలు. నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి కావడం గమనార్హం. 

 

 

కాగా., వెంకటప్పకు నాగవేణికి 1997లోనే వివాహం జరిగింది. కానీ.. పెళ్లి అయినప్పటి నుంచి ఈ జంట అన్యోన్యంగానే ఉండేవారని స్థానికులు తెలిపినట్లుగా అక్కడి వార్తా పత్రికలు పేర్కొన్నాయి. అసలు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంతకాలంగా వెంకటప్ప కట్నం కోసం నాగవేణిని ప్రతి రోజు వేధించడంతో పాటు కొడుతుండేవాడు. ఈ క్రమంలోనే నెల 3వ తేదీన రాత్రి భార్యతో తార స్థాయిలో గొడవ పడ్డాడు. భార్యను అడ్డుతొలగించుకోవాలనే దురాలోచనతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నాడని పోలీసులు చెప్పారు. 

 

 

అయితే.. ఆమె నిద్రపోతున్న సమయంలో చీరతో గొంతుకు ఉరి ముడి బిగించాడు. ఆమె మేలుకుని గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరుగున వచ్చి నాగవేణిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మైసూరు నగరంలోని ప్రవేట్‌ అస్పత్రిలో నాగవేణి చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు బాధితురాలి వద్ద వాంగ్మూలం తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: