ఈ మధ్యకాలంలో మనుషుల ప్రాణాలకు అసలు విలువ లేకుండా పోయింది. కనీసం మానవత్వం మరిచి సాటి మనుషుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే ఏకంగా ప్రాణాలను తీసేస్తున్నారు. క్షణికావేశంలో హత్యలు చేసి  కటకటాల పాలవుతున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి ఘటనలు చాలానే తెర మీదకు వస్తున్నాయి. ముఖ్యంగా రక్తసంబంధం ని మరిచి వావివరుసలు మరచి హత్యలు చేస్తున్నారు. ఇక తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. మేకను చంపాడు  అన్న  కోపంతో ఏకంగా  సొంత బావను  హత్యచేశాడు ఇక్కడ ఓ వ్యక్తి . పొలం పనికి వెళ్లి మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

 

 

 వివరాల్లోకి వెళితే... మేక విషయంలో తలెత్తిన వివాదంలో ఏకంగా సొంత బావ బావమరిది దారుణంగా హత్య చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా వైరామవరం మండలం పంచాయతీ నాగ లోమ  గ్రామంలో వెలుగులోకి వచ్చింది. నాగలోమా  గ్రామానికి చెందిన బలిజ బాలయ్య... సాల బొబ్బిలి రెడ్డి బావ బావమరుదులు. అయితే బావమరిది బొబ్బిలి రెడ్డికి చెందిన మేక తరచూ బావ బాలయ్య  పొలంలో మేస్తూ వస్తోంది. అయితే మేక పొలం అంత నాశనం చేస్తుందని ఈ విషయంపై బాలయ్య బొబ్బిలి రెడ్డి కి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే బాలయ్య కోపోద్రిక్తుడై సదరు మేకను  చంపేశాడు. 

 

 

 ఇక ఈ విషయంపై బావమరిది బొబ్బిలి రెడ్డి పంచాయతీ పెట్టించి వూరి పెద్దలందరు ని పిలిపించారు. ఇక గ్రామ పెద్దలందరూ పంచాయితీలో మేకకు  బదులుగా మరో మేక ఇవ్వాలని తీర్పు ఇచ్చారు. 15 రోజుల్లోగా బాలయ్య మేకను ఇవ్వాలని అంటూ ప్రశ్నించారు. అయితే బాలయ్య మాత్రం ఎప్పటికీ మేక ఇవ్వకపోవడంతో... బాలయ్య పొలం వద్దకు వెళ్లి పని చేసి కాస్త విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తన అనుచరులతో బాలయ్యను నిలదీశాడు బొబ్బిలి రెడ్డి . ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఇక ఈ గొడవలో  తీవ్ర కోపోద్రిక్తుడైన బొబ్బిలి రెడ్డి తన వెంట తెచ్చుకున్న కత్తితో బాలయ్య తలపై నరికాడు. దీంతో బాలయ్య  అక్కడికక్కడే కుప్పకూలిపోయారు చనిపోయాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న బాలయ్య భార్య బుల్లెమ్మ 25 కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: