రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.ఎన్ని  కఠిన చట్టాలు తీసుకొచ్చినా అత్యాచారాలు ఏమాత్రం ఆగడం లేదు. అత్యాచార నిందితులకు దారుణంగా ఎన్కౌంటర్ చేసి చంపిన ఎక్కడ మార్పు మాత్రం కనిపించడం లేదు. ఈ మధ్యకాలంలో దేవాలయం లాంటి చదువుల ఒడిలో కూడా మహిళలు లైంగిక వేధింపులకు ఎదుర్కోవాల్సి వస్తుంది. గురువుల ముసుగులో కామంతో కళ్లు మూసుకుపోయిన వారి చేతిలో ఆడపిల్లల బతుకులు చిద్రమై పోతున్నాయి. చిన్నపిల్లలని కూడా చూడకుండా  దారుణంగా హత్యాచారాలు చేస్తున్నారు. మంచి చెడులు చెప్పాల్సిన గురువులే కామంతో కళ్లుమూసుకు పోతే... పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారిపోతుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎన్నో తెర మీదికి వస్తుంది. 

 

 

 తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. మంచి చెడు వ్యత్యాసాలు తెలిసిన గురువులే తప్పుదారిలో నడుస్తున్నాడు. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా అతి దారుణంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇక తాజాగా ఉపాధ్యాయుడు. ముసుగులో  కామంతో కళ్లు మూసుకుపోయి... విద్యార్థులకు నీలి చిత్రాలు చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించిన కీచక టీచర్ యవ్వారం అనకాపల్లిలో బయటపడింది. వుడ్ పేట ప్రభుత్వ పాఠశాలలో కృష్ణమూర్తి వ్యాయామ ఉపాధ్యాయుడు పని చేస్తున్నాడు. ఇక ఉపాధ్యాయుడు ముసుగులో విద్యార్థులకు నీలి చిత్రాలు చూపిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడేవారు. దీంతో ఓ విద్యార్థిని తల్లిదండ్రులకు  ఈ విషయం చెప్పడంతో... బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 

 

 

 ఇక బాదిత విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద ఉపాధ్యాయుని పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అయితే ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో తరచూ జరుగుతూ ఉండటం సభ్యసమాజం తలదించుకునేలా చేస్తుంది. ఎంతో గౌరవ ప్రదమైన ఉద్యోగంలో కొనసాగుతూ... చిన్నారులను భావిభారత పౌరులుగా ఎంతో అత్యున్నత స్థాయికి ఎదిగేలా బోధించే ఉపాధ్యాయులు కామంతో కళ్లు మూసుకుపోయి చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు.. రోజురోజుకు మానవతా విలువలు మంట కలిసిపోతున్నాయి అన్న దానికి ఉదాహరణ మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: