తమిళ ఇండస్ట్రీలో త్రిషకు మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు తెలుగుతో పాటు తమిళ కన్నడ సినిమాల్లో టాప్ హీరోయిన్  గా  కొనసాగిన త్రిష ఆ తర్వాత... సినిమా అవకాశాలు లేక కొన్ని రోజులపాటు తెరమీద కనిపించలేదు. ఇక విజయ్ సేతుపతి తో కలిసి నటించినా 96 సినిమాతో త్రిష కెరీయర్ మరోసారి పట్టాలెక్కింది. అంతే కాదు 100 స్పీడ్ తో దూసుకుపోయింది. 96 సినిమాలో  విజయ్ సేతుపతి నటన తో పాటు త్రిష నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఇప్పటికీ ఫేవరెట్ సినిమా గానే ఉంది. ఇక ఈ సినిమా తర్వాత దర్శకనిర్మాతల చూపు మొత్తం త్రిష వైపు మళ్ళింది. దీంతో వరుస అవకాశాలు వచ్చే త్రిష చెంత వాలాయి . ఈ క్రమంలోనే మరోసారి బీజీ  హీరోయిన్ అయిపోయింది త్రిష. 

 

 

 96 సినిమా తర్వాత త్రిష అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం తమిళనాట తన హవా నడిపిస్తుంది హీరోయిన్ త్రిష. ఇదిలా ఉంటే తాజాగా నటి త్రిష తనను మోసం చేసింది అంటూ ఓ తమిళ నిర్మాత ఆవేదన వ్యక్తం చేశాడు. త్రిష నటించిన పరమపదమ్ విలయట్టు  అనే సినిమా ప్రమోషన్స్ కి వస్తాను అని చెప్పి... ఆ తర్వాత గైర్హాజరు అయ్యింది అంటూ ఆ సినిమా నిర్మాత లబోదిబోమంటున్నారు. సినిమాలో నటించాక ప్రమోషన్స్ కి రాకపోతే సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి ఎలా పెరుగుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అయితే సినిమా ప్రమోషన్స్ కి రావాలని త్రిషను ఆహ్వానించినప్పుడు తప్పకుండా వస్తాను అంటూ త్రిష తెలిపిందని.. కానీ తీరా సమయానికి ప్రమోషన్స్ కి డుమ్మా కొట్టింది ఆ నిర్మాత వాపోతున్నాడు. 

 

 

 తన సినిమా ప్రమోషన్స్ చేసే రోజు త్రిష కొత్త సినిమా ప్రారంభోత్సవానికి పెట్టుకుంది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. త్రిష కొత్త సినిమా ప్రారంభోత్సవం ఉంది అని తమకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే సినిమా ప్రమోషన్స్ మరొక రోజుకి మార్చే వాళ్ళం అంటూ చెబుతున్నాడు సదరు నిర్మాత. కానీ ఎన్ని పనులు ఉన్నా వస్తానని మాట ఇచ్చి ఆ తర్వాత ప్రమోషన్స్ కి రాలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో త్రిష తప్ప మిగతా వారందరూ కొత్తవాళ్ళు కావడంతో... త్రిష ప్రమోషన్స్ కి రావడం ఎంతో ముఖ్యమని నిర్మాత చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయాన్ని నిర్మాతల మండలి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: