దిశ అత్యాచార ఘటన గుర్తుందా.. ఆ ఘటనలో ఒక నిందితుడు చెన్న కేశవులు.. అత్యాచార ఘటన సమయానికే చెన్నకేశవులు భార్య రేణుక గర్భవతి.. చెన్నకేశవులు ఎన్‌ కౌంటర్ తర్వాత ఈ రేణుక విషయం మీడియాలో బాగా వచ్చింది. ఎందుకంటే.. ఆమె అప్పటికి మైనర్.. అయినా చెన్న కేశవులును ప్రేమించి పెళ్లి చేసుకుంది. అంతే కాదు.. చెన్నకేశవులు ఎన్‌ కౌంటర్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ అయ్యాయి.

 

 

అంతే కాదు.. నా భర్తను కాల్చి చంపారు.. నన్నూ అలాగే కాల్చి చంపండి అంటూ ఆమె పెట్టిన శోకాలు మీడియాలో బాగా ప్రసారమయ్యాయి. భర్త శవం కోసం ఆమె చాలా రోజులు ఎదురుచూడాల్సి వచ్చింది. చిన్న వయస్సులో పెళ్లి.. అంతలోనే గర్భం. మళ్లీ అంతలోనే భర్త అనూహ్య పరిస్థితుల్లో మరణం.. పాపం... ఏ నేరం చేయని రేణుక.. జీవితంలో ఇన్ని మలుపులు.. అందుకే రేణుక వార్తలు మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

 

 

ఇక ఇప్పుడు చెన్నకేశవులు భార్య రేణుక తాజాగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. గురువారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి రేణుకా మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి ప్రసవం కోసం వచ్చి చేరింది. శుక్రవారం ఆడపిల్లకు జన్మనిచ్చింది రేణుక. తల్లీ బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారు. రేణుక భర్త చెన్నకేశువులు దిశా హత్యాచారం కేసులో ఏ2గా ఉన్నాడు.

 

 

ఇక దిశ హత్యాచార ఘటన వివరాల్లోకి వెళ్తే.. నవంబరు 27న పశు వైద్యురాలు దిశ పై శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద అరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు సామూహికంగా అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసి.. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి బ్రిడ్జి కింద తగులబెట్టారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దిశ హంతకులను పోలీసులు రెండు రోజుల్లోనే పట్టుకున్నారు. డిసెంబరు 6న పోలీసులు వీరిని ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ ఎన్‌ కౌంటర్‌ తో సజ్జనార్ పేరు మరోసారి మారుమోగింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: