భార్య భర్తల బంధం అనేది అన్యోన్యంగా బంధం ఎందుకంటే ప్రేమ అనే బంధానికి చాలా విలువ కలిగి ఉంటుంది.. అందుకే ప్రేమకు విలువెక్కువ.. ఇకపోతే ప్రేమించిన ప్రేమ కన్నా కూడా బంధాలతో కలుపుకున్న బంధం చాలా విలువైంది అందుకే భార్యా భర్తల బంధం నూరేళ్ళ పంట అని చాలా ముఖ్యమైనది అని నిరూపిస్తున్నారు.. అయితే ఒకరితో మరొకరు జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త అనుమానం అనే పెను భూతంతో ఆమె పై నిప్పంటించారు... దారుణం

 

 

వివరాల్లోకి వెళితే.. మీరట్.జిల్లాలోని షామ్లికి చెందిన ముస్తకీం, మస్రుఫా దంపతులు. గత కొద్దికాలంగా ఇరువురి మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో భార్యను నమ్మకంగా భవన్‌పూర్ మండలంలోని ఝాయ్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో కోపంతో ఊగిపోయిన ముస్తకీం రాయితో భార్యను విచక్షణా రహితంగా కొట్టాడు.

 

 

ఏకధాటిగా భర్థకొట్టడంతో శృహ కోల్పోయింది..అయినా కూడా తనని వదలకుండా విచక్షణా రహితంగా ప్రవర్తించారు..సమీపంలోని చెరకు తోటల్లోకి వెళ్లి చెత్తను ఏరుకొచ్చి ఆమెపై వేసి.. పెట్రోల్ పోసి నిప్పింటించాడు. మంటల్లో కాలిపోతూ ఆమె రోడ్డు వైపు సుమారు 200 మీటర్ల దూరం పరిగెత్తింది. అది గమనించిన స్థానికులు మంటలను ఆర్పివేసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న భావన్‌పూర్ పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

 

 

దాదాపు పూర్తిగా కాలిపోయిన ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.. మంటల్లో కాలిపోతూ భార్య పరిగెత్తిన వీడియో వైరల్‌గా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యాయత్నం చేయడంపై అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు...గృహహింస, మర్డర్ కేసు, పొక్స్ కేస్ను నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: