ఎన్ని చట్టాలు వచ్చినా, అత్యాచార దోషులపై ఎన్ కౌంటర్లు జరుగుతున్నా మహిళల భద్రత కొరకై ఎన్నో న్యాయ వ్యవస్థలు, పోలీసుల వ్యవస్థలు ఉన్నా కామాంధుల అఘాత్యాలకు చెక్ పెట్టలేకపోతున్నాయి. నీతి లేని జీవితాన్ని గడుపుతున్న ఈ మగ మృగాళ్లు ఆడది కనిపిస్తే చాలు వారి జీవితాన్ని చిదిమేస్తున్నారు. ఐదారు దశాబ్దాల క్రితం మనదేశంలో 30 సంవత్సరాలు వచ్చే వరకు చాలామంది బ్రహ్మచర్యం పాటించేవారు. అప్పటివరకు ఆడ దాని వైపు కన్నెత్తి కూడా చూడకపోయేవారు. కానీ పాశ్చాత్య సంస్కృతి ఎప్పుడైతే మన దేశం లోకి ఎంటర్ అయిందో అప్పటినుండి 15ఏళ్ళ ఆకతాయిలు కూడా అక్క, చెల్లి, తల్లి లాంటి ఆడవారిని కూడా చెడుగా చూస్తున్నారు. అయితే తాజాగా వరంగల్ జిల్లాలో జరిగిన ఒక కిరాతకమైన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది.



వివరాలు తెలుసుకుంటే... వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలం కాట్రపల్లి కి చెందిన ఒక అమ్మాయి తన చిన్నతనం నుండే పోలియో వ్యాధి బారిన పడింది. ఈ వ్యాధిగ్రస్తురాలకి మానసిక వైకల్యం కూడా ఉంది. దీంతో తన కుటుంబ సభ్యులు పని నిమిత్తం బయటకు వెళ్తే ఆమె ఒక్కటే ఇంట్లో ఉంటుంది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నాడు కొలను పల్లి కి చెందిన వంగాల ఎల్లస్వామి అనే యువకుడు. శుక్రవారం ఆమె ఇంట్లో ఎవరూ లేరని తెలిసి... దొంగతనంగా ఇంట్లోకి ప్రవేశించి ఏమాత్రం మానవత్వం లేకుండా ఆమెపై అతి కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. తనపై ఏమి జరుగుతుందో కూడా తెలియని ఆ అమాయకురాలు పరిస్థితి ఊహించుకుంటేనే ప్రతి ఒక్కరికి కన్నులు చెమ్మగిల్లుతాయి. కానీ మన మధ్య తిరుగుతున్న ఈ రాక్షసుడికి మాత్రం ఆ దివ్యాంగురాలు కి రక్తస్రావం అవుతున్నా తన కిరాతక చర్యని కొనసాగించాడు. ఐతే బాధితురాలిని మానభంగం చేసిన తర్వాత ఇంట్లో నుంచి కంగారు పడుతూ బయటకు వస్తుంటే స్థానికులు గమనించారు.




కొద్దిసేపటికి బాధితురాలి సోదరుడు కాలేజీ నుండి ఇంటికి చేరుకోగా అతనికి తన సోదరి రక్తపు మరకలతో కనిపించింది. దాంతో ఒక్కసారిగా నిర్ఘాంత పోయిన సోదరుడు బయటికి వచ్చి స్థానికులకి ఈ విషయం చెప్పాడు. ఈ కిరాతకాన్ని ఇందాక ఇంట్లో నుంచి కంగారు పడుతూ వచ్చిన వాడే చేసి ఉంటాడని అతడి కోసం వెతకగా... పంచరు షాపు వద్ద నిందితుడు పట్టుబడ్డాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్తులు అతడిని విద్యుత్ స్తంభానికి కట్టేసి చెప్పులతో, బూట్లతో కొట్టి పోలీసులకు సమాచారం అందించగా... కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: