చంద్రబాబు చేసే అరాచకాలు.. చేసిన అరాచకాలను బయటకు తియ్యాలి అంటే అది ఖచ్చితంగా విజయసాయి రెడ్డి వల్లే అవుతుంది. వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రతిపక్ష పార్టీ నేతలు చేసే ఆరోపణలపై ఎప్పటికప్పుడు స్పందించి పంచులు వేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు దోపిడీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.. 

 

దేశ వ్యాప్తంగా యస్‌ బ్యాంక్‌ సంక్షోభంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.. అయితే టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సకాలంలో స్పందించి డిపాజిట్లను వెనక్కు తీసుకోవడంతో 1300 కోట్ల టీటీడీ నిధులు ప్రమాదం తప్పింది. ఈ విషయం అందరికి తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.   

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ''చంద్రబాబు యస్‌ బ్యాంక్‌'ను అడ్డం పెట్టుకునీ రాష్ట్రాన్ని లూటీ చేశాడు. 1300 కోట్ల టీటీడీ నిధులు డిపాజిట్ చేయించి కమీషన్లు తీసుకున్నాడు.ఛైర్మన్ సుబ్బారెడ్డి గారు సకాలంలో స్పందించి డిపాజిట్లను వెనక్కుతీసుకోవడంతో ప్రమాదం తప్పింది. యస్‌ బ్యాంక్‌'కు ఏపీ టూరిజం శాఖ నిధులనూ దోచిపెట్టాడు.ఇంకెన్ని ఉన్నాయో?'' అంటూ అనుమానం వ్యక్తం చేశారు విజయసాయి రెడ్డి. 

 

ఈ ట్విట్ పై నెటిజన్లు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు చంద్రబాబు అంతే అని కామెంట్స్ చేస్తే.. మరికొందరు స్పందిస్తూ.. సుబ్బారెడ్డి గారు సమయ స్పూర్తితో సరి సమయం లో స్పందించక పోతే ప్రమాదం తప్పని సరి అయ్యేది. వారికీ ధన్యవాదాలు.'' అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: