శృతి హాసన్ ఈ పేరు తెలుగు ఇండస్ట్రీలో పరిచయం లేని పేరు. ఈ బ్యూటీ గురించి చెప్పాలంటే మొన్నటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. అయితే.. ఈ భామ ఇటీవల కాలంలో తన ముక్కుకు సర్జరీ చేపించుకుని తన షేప్స్ ని ఇంకా మార్చేసింది. దాదాపు శృతి హాసన్ పెద్ద పెద్ద హీరోలతో జతకట్టింది. ఆ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో తనకంటూ ఒక క్రేజ్, ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది.
కాగా., ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్ లో కొంత గ్యాప్ తీసుకుంది. చాలా రోజుల తర్వాత తెలుగులో రవితేజ సరసన నటిస్తోంది. డాన్ శీను, బలుపు చిత్రాల తర్వాత హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలిసి సినిమా చేయబోతున్నారు. అయితే.. ఇదే సినిమాతో మళ్లీ రవితేజ, శ్రుతీహాసన్ కలిసి నటించడం ఆశ్చర్యకరం. ఈ ఇద్దరూ 2013 లో వచ్చిన బలుపు చిత్రంలో కలిసి జంటగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది కదా. 2017 లో వచ్చిన కాటమరాయుడు సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించింది. ఇంకా అప్పటి నుంచి ఈ భామ తెలుగు సినిమాలలో గ్యాప్ తీసుకుంది.
ఇక ఇప్పుడు రెండేళ్ల తర్వాత శ్రుతీ హాసన్ అంగీకరించిన తెలుగు చిత్రం క్రాక్ ఏ. ఇక సినిమా విషయానికి వస్తే ఈ చిత్రాన్ని బి.మధు నిర్మిస్తున్నారు. ఇక దీంతో పాటు ఈ భామ పవన్ సరసన మరో సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. పవన్ కళ్యాన్ తో ముచ్చటగా మూడోసారి శృతి హాసన్ నటిస్తోంది.
ఇదిలఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 28వ చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్వం నిర్వహిస్తున్నాడు. ఈ సంగతి తెలిసిందే. కాగా., గతంలో హరీష్, పవన్ కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో శృతి హాసన్ పవన్ సరసన నటించింది. కొత్తగా నిర్మించే చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ నటించనుందనేది సమాచారం. పవన్ శృతి జోడీకి మంచి క్రేజ్ ఉండటంతో హరీష్ ఆమెను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఇదిలఉండగా GQ మ్యాగజైన్ కోసం శృతి చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.