ఈ కాలంలో భగవంతుడంటే ఒక రాయి అనుకుంటున్నారు.. అందుకేనేమో కొందరైతే ఏదో మొక్కుబడిగా బయటనుండే దండం పెట్టుకుని.. ఏదో కొంపలు మునిగినట్లుగా పరుగులు పెడతారు.. సినిమా హల్లో, సెల్లులో సొల్లు ముచ్చట్లు చెప్పుకోవడంలో తగలబెట్టే సమయాన్ని కొంతైన భగవంతుని సన్నిధానంలో గడపాలని ఆలోచించరు... ఇంకొందరు గుడికి వచ్చి పూజచేస్తున్నట్లే కానీ మనసంతా ఎక్కడెక్కడో ఉంటుంది. మనిషి మాత్రం టెంపుల్లో ఉంటాడు.. ఇది నేటికాలం భక్తుల పరిస్దితి.. అయితే కొందరికి మాత్రం అప్పుడప్పుడు విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి.. అవి యాదృచ్చికంగా జరుగుతాయో, లేక ఆ దైవం అనుగ్రహంతో జరుగుతాయో తెలియవు..

 

 

భగవంతుడంటే నమ్మకం ఉన్న వారు మాత్రం ఇలా జరగడం దేవుని లీల అంటారు.. దేవుడంటే నమ్మకం లేని వారు మాత్రం అలా జరగడానికి కారణాలు వెతుకుతారు.. ఏది ఏమైనా శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు.. అందుకే కావచ్చూ ఈ అమ్మాయికి ఆ శివాలయంలో ఈ వింత అనుభవం ఎదురైంది.. వివరాల్లోకి వెళితే ఆ వీడియోలో ఉన్నదాని ప్రకారం.. ఒక యువతి ఆలయం వెలుపల నుండే దైవ దర్శనం చేసుకుని, వెళ్ళడానికి సిద్దపడగా.. ఆమె స్కూటి స్టార్ట్ అవలేదు.. కాస్త అటూ ఇటూ ఆ బండిని సర్దగా మొత్తానికి బండి స్టార్ట్ అయ్యింది.. అయితే అప్పటికే ఎక్సిలేటర్‌ను ఫుల్ రేస్‌లో ఉంచడంతో ఆ స్కూటర్ నేరుగా ఆలయంలోనికి  ప్రవేశించి నంది వద్ద పడిపోయింది.  ఈ ఘటనలో ఆమె కూడా నంది చరణాల వద్ద పడిపోయింది.

 

 

ఈ సంఘటన మహారాష్ట్రలోని వాకడ్‌ లో ఉన్న ఓ ఆలయంలో జరిగింది.. ఇకపోతే వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన వారంతా... ‘బయటి నుంచి మొక్కుబడిగా దండం పెట్టుకుంటున్న భక్తురాలిని భగవంతుడు ఆలయం లోనికి రప్పించుకున్నాడంటూ’ కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు ఈ వీడియో చూసి తెగ ఆశ్యర్యపోతున్నారు... ఏది ఏమైనా ఆమె మాత్రం అదృష్టవంతురాలనుకుంటున్నారు శివ భక్తులు.. ఎందుకంటే ఎలాంటి అపాయం జరుగకుండా ఏకంగా శివదర్శనం కలిగింది.. ఇదంతా శివ అనుగ్రహం వల్లే జరిగిందంటున్నారు కొందరు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: