కొన్ని కొన్ని సార్లు మృత్యువు ఎటు దారి నుంచి వస్తుందో అసలు చెప్పలేనిది. గాచారం బాగాలేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు అన్నది ఓ నానుడి. ఇక్కడ జరిగిన ఘటన ఈ సామెతకు సరిగ్గా సరిపోతుంది. అనుకోకుండా వచ్చిన మృత్యువుతో మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయారు. ఊహించని పరిణామం నుంచి తప్పించుకోలేక ప్రాణాలు  కోల్పోయారు. ఒక మందు బాటిల్ రూపంలో.. ఇక్కడి మత్స్యకారులు యమధర్మరాజు అనుగ్రహాన్ని పొందినట్టున్నారు... ఏకంగా తమకి తాము మందు బాటిల్ లోని మద్యాన్ని సేవించి ప్రాణాలు విడిచారు. సముద్రంలో కొట్టుకొచ్చిన ఓ మందు బాటిల్ లోని మద్యం సేవించి మత్స్యకారులు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం  మండలం లో చోటుచేసుకుంది. 

 


  వివరాల్లోకి వెళితే... కొత్తపట్నం మండలం లోని గుండాల కు చెందిన మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. అయితే చేపల వేట కొనసాగుతున్న సమయంలో సముద్రంలో ఒక బాటిల్ నీళ్ల పైన కొట్టుకుంటూ పడవ దగ్గరికి వచ్చింది. ఇక ఆ బాటిల్ మద్యం బాటిల్ ను  పోలి ఉండటంతో అది నిజంగానే మద్యం అనుకున్నారు. దీంతో కక్కుర్తిపడి తలా కొంచెం మద్యం తాగేశారు. వెంటనే తీవ్ర అస్వస్థతకు గురై ఇద్దరు మత్స్యకారులు చనిపోయారు. మరో మత్యకారుడు స్పృహ  కోల్పోగా....అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

 


 అయితే సముద్రంలో ఒక బాటిల్లో కొట్టుకొచ్చింది మద్యం  కాదని అది కెమికల్  అని నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే అది మద్యం అనుకుని తాగిన మత్స్యకారులు కొద్దిసేపటికే మృత్యువాతపడ్డారు. ఇక ఇది గమనించిన ఇతర మత్స్యకారులు... అకస్మాత్తుగా ఇతర మత్స్యకారులు చనిపోవడం చూసి షాక్ కి గురయ్యారు. ఇక మరో మత్స్యకారులు స్పృహ కోల్పోగా  చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ మత్స్యకారుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: