నేటికాలంలో అసలు మగాన్నే నమ్మేలా లేదు.. వాడు అన్న కావచ్చూ, తండ్రి కావచ్చూ.. వావివరసలు మరచి సలసల కాగుతున్న కోరికలను విచ్చలవిడిగా ఊర కుక్కల్లా ఆడపిల్లల మీద పడి తీర్చుకుంటున్నారు.. ప్రస్తుత పరిస్దితులు లోకంలో ఎలా ఉన్నాయంటే మగవాడు బ్రతికేది ఆడదాన్ని మల్లెపువుల్లా నలిపేయడానికే అన్నట్లుగా కొనసాగుతున్నాయి.. నమ్మించి ఒకడు, బెదిరించి ఒకడు. వంచన చేసి ఒకడు, ఇలా చెప్పుకుంటూ వెళ్లితే అడుగడుగున అత్యాచారాలే కనిపిస్తాయి.. ఇంకా కొన్ని రోజులాగితే కన్నతల్లిని కూడా చెరబట్టేలా ఉన్నారు కామాంధులు..

 

 

ఒకరకంగా మనుషులకు మృగాలకు తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు.. పసిపిల్లలను కూడా చూడటం లేదు.. కండ‌కావ‌రంతో ఉన్న కామాంధుల‌కు ఆడపిల్ల అయితే చాలు.. గుంట నక్కల్లా పీక్కుతింటున్నారు.. అందుకే ఆడపిల్లను ఒంటరిగా వదలాలంటే భయపడే రోజులు వచ్చాయి..

 

 

ఇకపోతే ఇంటర్ చదువుతున్న కుర్రాడు అని చెప్పబడే ఓ కౄరుడు 12 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేశాడు.. ఎప్పటినుండో ఈ పాడుపని చేయడానికి గోతికాడి నక్కలా కాపుకాయగా, ఆ అవకాశం ఆమె ఒంటరిగా ఉండటం అనే రూపంలో చిక్కింది.. ఇంకేం ఉంది పశువులా మీదపడి పని కానిచ్చుకున్నాడు.. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామంలో చోటు చేసుకుంది.

 

 

ఇంటికి వచ్చిన తన తల్లిదండ్రులకు బాధిత బాలిక జరిగిన దారుణం గురించి చెప్పడంతో వారు యాదగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇకపోతే బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ పాండు రంగారెడ్డి తెలిపారు...

 

 

ఇక కామంతో కొట్టుమిట్టాడుతున్నా వెధవలకు అక్కడ కోసి కారం పెట్టి అసలే పనికి రాకుండా చేసే శిక్షలు అమలు చేస్తే గాని వారి మధం దిగదు.. లేదంటే ఎంతగా చెప్పిన దున్నపోతు మీద వాన కురిసినట్లే అవుతుంది గాని కొంతైనా భయం కలగడం లేదు.. ఇక అమ్మాయిలు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక కారం పొడి పాకెట్ ఎప్పుడు వెంట ఉంచుకోండి.. కామాంధులనుండి కనీసం కొంతవరకైన రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: