ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా ఈ వారం హీరోలు ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సంచయిత గజపతి... మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన ఈ అమ్మాయి ఈ వారాంతంలో హాట్ టాపిక్ అయిపోయింది. అప్పుడప్పుడు మీడియాలో మాత్రమే కనపడే ఈ అమ్మాయిని సింహాచలం దేవస్థానం చైర్మన్ గా, వేల ఎకరాల భూములు, పలు విద్యాసంస్థలు నడుస్తున్న మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ జీవో విడుదల చేయడంతో ఆమె హాట్ టాపిక్ అయిపోయారు. ఇక సోషల్ మీడియాలో ఆమె కేంద్రంగా విమర్శలు వస్తున్నాయి. 

 

ముఖ్యంగా సోషల్ మీడియా లో టీడీపీ కార్యకర్తలు ఆమె లక్ష్యంగా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఆనంద గజపతి రాజు కుమార్తె ఆమె. అయితే ఆమె క్రిస్టియన్ అంటూ టీడీపీ ఆరోపిస్తుంది. ఇక అశోక గజపతి రాజు కూడా తనను తప్పించి ఆమెకు బాధ్యతలు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. రాజకీయంగా విమర్శలు వస్తున్న నేపధ్యంలో సంచయిత కాస్త ఘాటుగానే స్పందించారు. తన తాత వారసత్వాన్ని నిలబెట్టే హక్కు తనకు ఉందని ఆమె స్పష్టంగా చెప్పారు. గతంలో అశోక్ గజపతి రాజు కుమార్తె అయిన అదితిని నియమించినప్పుడు తాను గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. 

 

ఆమె కేంద్రంగా ఈ వారం రాజకీయం మొత్తం నడిచింది. జీవో విడుదల చేయడం ఆమె బాధ్యతలు స్వీకరించడం మతపరమైన అంశాలు ఇలా ప్రతీ ఒక్కటి కూడా ఈ వారం ఎక్కువగా హైలెట్ అయ్యాయి. ఆమె వస్త్రాల మీద కూడా టీడీపీ విమర్శలు చేస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో ఇవే విమర్శలు ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి. ఆమె చరిత్ర క్రైస్తవం తో ఉందని అలాంటి వ్యక్తిని హిందు దేవాలయానికి ఏ విధంగా చైర్మన్ ని చేస్తారని ప్రశ్నిస్తున్నారు. మరి చర్చికి. మసీదు కి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటీ అంటూ ఆమె ప్రశ్నిస్తుంది. ఇలా ఈ వారం ఆమె హీరో అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: