రోజురోజుకు మహిళలు ప్రశ్నార్ధక జీవితాన్ని గడుపుతున్నారు. ఎటు వెళ్లిన ఏం చేసినా ఎంత జాగ్రత్తగా ఉన్నా కామాంధుల కోరల్లో చిక్కుకొక  తప్పడంలేదు మహిళలు. మనిషి పుట్టుకకు మూలాధారమైన మహిళలకే ప్రస్తుతం రక్షణ కరువైంది. కామంతో కళ్లు మూసుకుపోయి కనీసం మానవత్వం మరిచి అతి దారుణంగా అత్యాచారానికి ఒడిగడుతున్నారు . అనంతరం హత్యలు  సైతం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. కామాంధులను  ఎన్కౌంటర్ చేసి చంపిన ఎవరిలో భయం కనిపించడం లేదు. 

 

 

 ముక్కుపచ్చలారని చిన్నారుల నుంచి... పండు ముసలి వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు కామాంధులు. ఆడది కనిపిస్తే చాలు కామంతో కళ్లు మూసుకుపోయి మీద పడి పశువాంచ తీర్చుకుంటున్నారు. వావి వరసలు మరిచి  మరీ అతి దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ మళ్ళీ తిరిగి క్షేమంగా ఇంటికి వస్తుందా లేదా అనే భయంతోనే బతుకుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి చిన్న పిల్లల పైనే కాదు వృద్ధుల పైన కూడా అత్యాచారాలు జరుగుతున్న ఘటనలు ఈ రోజుల్లో చాలానే తెర మీదకు వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. 

 

 

 కామం తో ఊగిపోయిన ఓ యువకుడు ఒంటరి వృద్ధురాలిపై అత్యాచారం పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా ఎర్ర వారి పాలెం లో జరిగింది. మండలంలోని ఉదయ మాణిక్యం పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వృద్ధురాలు భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తోంది. నిన్న తన పాడి ఆవులను  మేపు కుంటూ తనకున్న... రెండు ఎకరాల పొలం వద్దకు వెళ్ళింది ఆ వృద్ధురాలు. ఇక చుట్టుపక్కల ఎవరూ లేనిది  గమనించిన అదే గ్రామానికి చెందిన వడ్డే చిన్నరెడ్డెప్ప ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక కొంత సమయం తర్వాత తేరుకున్న బాధితురాలు ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని ఇరుగు పొరుగు వారికి చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: