తాజాగా ఎన్నో విషయాలు జనాల్ని బాధిస్తున్నాయి. ముఖ్యంగా అందరినీ పీడుస్తున్న ఆ భూతం
కరోనా వైరస్. ఖండాలు దాటి దేశాలు దాటి రాష్ట్రాలలోకి ప్రవేశం చేసింది. ఎంతో మందిని ఇప్పటికే కరోనాకి బాధితులని చేసింది. అయితే
కరోనా వైరస్ నిజంగా ఓ కలంకలం సృష్టిస్తోంది. ఎంతో మంది ఈ వైరస్కి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కూడ తెలిసినదే. అయితే
కరోనా నిజంగా ప్రమాదకరమే...
ఈ విషయంపై అనేక వార్తలు వింటునే ఉన్నాం. బెంగుళూరులో వ్యాధికి తగ్గ సింప్టంస్ ఏమైనా ఉంటే...ఐ.టి కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుని పని చేసుకోవడనికి
కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చు వారు సులువుగా ఇంట్లో నుండి. అలానే మాస్క్స్ వేసుకుని బయటకి వెళ్ళమనడం, ఫ్లూ సోకకుండా సానిటైజర్ వంటివి తీసుకుని ముందు జాగ్రత్త తీసుకోమనడం ఇలా ఎన్నో జాగ్రత్తలపై మన
మీడియా ఫోకస్ చేసింది.
అయితే
కరోనా వైరస్కి ఎవరైనా గురైతే వారికి చికిత్స పొందేలా
హెల్త్ సెంటర్స్ని నియమించినట్లు కూడా చెప్పింది మీడియా. ఈ కాలంలో విదేశాల నుండి వచ్చిన వారికి కొన్ని
కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి వారిపై స్పెషల్ కేర్ తీసుకుంటోంది
హెల్త్ సెంటర్. ఇలా
కరోనా వైరస్ పై అనేక కోణాల్లో వార్తలు ఈ వారం అంతా వినిపిస్తూనే ఉంది. ఇది అందరూ చూసినదే, విన్నదే.
విని వదిలేయడం కాదు. జాగ్రత్త పాటించడం ఎంతో అవసరం. కనుక వాటిని ఫాలో అయ్యి ఆరోగ్యంగా ఉండడం ఎంతో ఉత్తమం. కాబట్టి తప్పక పాటించడం ఎంతో మంచిది. ఇలా ఈ వారం
కరోనా వైరస్ పై
మీడియా అనేక విధాలుగా కవర్ చేసింది. కరోనాపై చెప్పి తీసుకోవలసిన జాగ్రత్తలని చెప్పింది మీడియా.