భారత ప్రధాని మోదీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రతేకంగా చెప్పవలిసిన అవసరం లేదు. ఎందుకంటే అయన ఎవరినైనా గురించి మాట్లాడాలన్నా, ఈదిన తాను తీసుకున్న విషయాన్ని క్లుప్తంగా, క్లియర్ గా చెప్పాలన్న అయన ట్విట్టర్ ని వేదికగా చేసుకొని పూర్తి విషయాన్ని అందులో చెబుతారు. కానీ ఇక ఆ పని చేయనంటున్నారు ప్రధాని మోదీ.
ఇప్పుడు ఆయన సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పారు. మోదీ ఏకంగా సామాజిక మాధ్యమాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ఆయన ప్రకటించారు. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని తాను గతంలో చెప్పినట్టుగానే సామాజిక మాధ్యమాలకు ఇక సెలవు పలుకుతున్నట్లు ట్వీట్ ఆయన చేశారు.
Greetings on international Women’s Day! We salute the spirit and accomplishments of our Nari Shakti.
— narendra modi (@narendramodi) March 8, 2020
As I’d said a few days ago, I’m signing off. Through the day, seven women achievers will share their life journeys and perhaps interact with you through my social media accounts.
ఇక ముందు ఆయన సోషల్ మీడియా అకౌంట్లను ఏడు మంది మహిళామణులు హ్యాండిల్ చేస్తారని ఆయన చెప్పారు. దేశంలో ఎంతో మంది ప్రతిభామూర్తులు ఉన్నారని.. వారంతా వివిధ రంగాల్లో విస్తృత సేవలు అందిస్తున్నారని మోదీ ట్వీట్ చేశారు ఆయన. నిజానికి వారి యొక్క పోరాటం లక్షలాది మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. వారి విజయోత్సవ సంబరాలు చేసుకుంటూనే, వారి నుంచి నేర్చుకుందామని ట్విట్టర్ లో ఆయన తెలిపారు.
ఇదింత ఆలా ఉండగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలకు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ‘నారీ శక్తి’ పురస్కారాలు ఇవ్వనున్నారు. వారితో ప్రధాని మోదీ మాట్లాడవచ్చు. మోదీ మహిళల కోసం అనేక రకాల స్కీములు ఎన్నో ప్రారంభించి వాటిని అమలు పరుస్తున్నారు. ఆయన స్త్రీ లకు ఎంత ప్రాముఖ్యతనిస్తారో ఆయన క్యాబినెట్ లో ని మహిళా మంత్రులను చుస్తే ఇట్లే అర్థం అవుతుంది. అందులో ముఖ్యంగా ఫైనాన్స్ మిస్టర్ లాంటి కీలక పదవిని నిర్మల సీతారామన్ కి ఇవ్వడం ఆయన స్త్రీల ఉండే నక్కమ్మని ఇట్లే తెలియపరుస్తుంది.